E-Paper
Advertisement

SSMB-29: మహేశ్- రాజమౌళి సినిమా.. కథ చెప్పేసిన విజయేంద్ర ప్రశాద్..!

SSMB-29: మహేశ్- రాజమౌళి సినిమా.. కథ చెప్పేసిన విజయేంద్ర ప్రశాద్..!

SSMB-29: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే నెక్స్ట్ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆయన ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ ప్రపంచం మొత్తం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తీస్తున్నట్లు ప్రటించారు. ఫుల్ యాక్షన్ అండ్ అడ్వంచర్‌తో కూడిన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. దీంతో మహేశ్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మహేశ్ ముఖ్యంగా ఈ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేసినట్లు ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రశాద్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విశేషాలని అతడు పంచుకున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రశాద్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాల్ని తెలుపుతూ.. మరింత హైప్ పెంచేశారు.

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్ – రాజమౌళి సినిమా ‘ఇండియానా జోన్స్’లా ఉంటుందని అన్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని చెప్పారు. ఈ సినిమా ఎక్కువగా అడవి నేపథ్యంలోనే సాగుతుందని తెలిపారు. అలాగే ఈ సినిమా సంగీతం గురించి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన మాటలతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×