Naa Anveshana : ప్రముఖ యూట్యూబ్ ట్రావెలర్ నా అన్వేషణ అన్వేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనను ప్రస్తుతం తెలుగు వాళ్లకు టార్గెట్ గా మారాడు.. ఆడవాళ్ళ వస్త్రాల గురించి సపోర్ట్ చెయ్యి అంతేకానీ దేవుళ్ళ గురించి అభ్యంతర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు అంటూ హిందూ సంఘాలు అతనిపై సీరియస్ అవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. అతని కోసం పోలీసులు గాలిస్తున్న సరే అతను మాత్రం తనని ఎవరు ఏం పీకలేరు అంటూ రెచ్చిపోతున్నాడు. వివాదాలు పై స్పందిస్తూ వీడియోలను షేర్ చేస్తూ మరోసారి జనాలకు కోపాన్ని తెప్పిస్తుంటాడు. తాజాగా ఈ క్రమంలో మరో వీడియోని అన్వేష్ షేర్ చేసారు. ఆ వీడియోలో 2026 నుంచి కీలక నిర్ణయం తీసుకుపోతున్నట్లు చెప్పారు. అంతే కాదు కొందరు గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో జనాలు అన్వేష్ ఎవరి గురించి చెప్పారా అని తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరి గురించి అన్నారో వివరంగా తెలుసుకుందాం..
తాజాగా యూట్యూబర్ అన్వేష్ తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేసాడు.. ఆ వీడియోలో మాట్లాడుతూ.. రాత్రి ఆంజనేయ స్వామి కలలో కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఇచ్చాడు. విజయాలు కలుగుతాయని చెప్పాడు. కొన్నాళ్లు ట్రావెలింగ్ పక్కనపెట్టి ప్రజా సమస్యలపై పోరాడమన్నాడు.. కాషాయం రంగు కట్టుకొని దేశాన్ని దోచుకుంటున్న వారి అంతు చూడమని నా కలలో చెప్పాడు.. అంతే కదూ నా పని నన్ను చేసుకోమని ఆంజనేయ స్వామి చెప్పాడు. అయితే బూతులు మాట్లాడకుండా ఉండాలని స్వామి చెప్పాడు నేను అదే పాటిస్తాను అని అతను అన్నాడు. 2026 నుంచి నేను ఇక బూతులు మాట్లాడను మీకు మాటిస్తున్నాను ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని అంటాడు.. ఒకవేళ బూతులు మాట్లాడితే నన్ను మీరు చెప్పుతో కొట్టండి అని అంటాడు.. సడన్గా అన్వేష్ ఎందుకు రూట్ మార్చారని చాలామంది జనాలు ఆలోచనలో పడ్డారు.
Also Read :39 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ.. ఇన్నేళ్లు కళ్యాణ్ చక్రవర్తి ఏం చేశాడంటే..?
అంతేకాదు ఈ ఏడాది నుంచి నేను మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలని అనుకుంటున్నానని అన్వేష్ అంటారు. భారతీయ మహిళలకు స్వేచ్ఛ లేదు దానిపై నేను పోరాడాలని అనుకుంటున్నాను అని అతను అంటాడు. కొందరు దోపిడీలు దొంగతనాలు చేస్తూ జై శ్రీరామ్ అంటున్నారు. ఇండియాలో రాముడి పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. మతం మత్తులో అన్యాయాలు చేస్తున్నారు. జై శ్రీరామ్ అంటున్నారు. అలాంటి బత్తాయిలను కొట్టమని దేవుడు చెప్పాడు. అంతేకాదు కొందరికి కొన్ని వింగ్స్ ఉన్నాయట.. ఆరెక్కలని నన్ను కట్ చేయమని చెప్పాడు. రోజుకు 16 గంటలు కష్టపడి, 8 వీడియోలు పెడతాను. 2 కోట్లు సంపాదించి, యాభై లక్షలు ఇండియాకి ట్యాక్స్ కట్టమని దేవుడు చెప్పాడు.. ఇక బూతులు లేకుండా ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తాను అని అంటాడు. నా వీడియో వస్తే అందరికీ వెన్నులో వణుకుపుట్టాలి అంటూ అన్వేష్ వీడియోలో అన్నాడు. దేవుడు పేరుతో తాను చేయబోతున్న పనుల గురించి చెప్పుకొచ్చాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనిపై ఎన్ని వివాదాలు మొదలవుతాయో చూడాలి..
?igsh=MTJuMTlwd2h3cDA0dQ==