E-Paper
Advertisement

Ethiopia Landslide: తీవ్ర విషాదం.. కొండ చరియలు విరిగిపడి 157 మంది మృతి

Ethiopia Landslide: తీవ్ర విషాదం.. కొండ చరియలు విరిగిపడి 157 మంది మృతి
Advertisement

Ethiopia Landslides: ఇథియోపియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా అతలాకుతలం అయింది. కొండ చరియలు విరిగిపడి 157 మంది మరణించారు. అందులో చిన్న పిల్లలు, గర్భిణులు సహా వృద్ధులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సోమవారం దక్షిణ ఇథియోపియాలోని గోఫా జోన్ పరిధిలో ఉన్న కెంచో షాచా గోజ్జి జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ఎగువ నుంచి వచ్చిన బురద ముంచెత్తింది. వాటిలో కూరుకుపోయి ఊపిరి ఆడక 157 మంది మరణించారు. ఇథియోపియా కొండచరియలు కూలి మరణించిన వారి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. బురదలో కూరుకుపోయి 157 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలు ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలను రక్షించినట్లు తెలిపారు. అంతే కాకుండా ఈ ఘటనలో అనేక మంది గల్లంతు అయినట్లు వెల్లడించారు.

Advertisement

బురదలో విగతజీవులగా మరిన తల్లి, శిశువులు ఒకరినొకరు కౌగిలించుకుని ఉండటాన్ని చూసి అందరూ కంటతడి పెట్టారు. ఏటా వర్షాకాలంలో జులై నుంచి సెప్టెంబర్ మూడో వారం వరకు ఇథియోపియాలోని కొండ ప్రాంతాల్లో ఈ విధంగా కొండ చరియలు విరిగిపడుతుంటాయి. ప్రమాద నేపథ్యంలో మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలు చాలా ఉన్నాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. వాటిని బయటకు తీసుకురాలేకపోతున్నామని అన్నారు.

Also Read: తీవ్ర విషాదం.. కొండ చరియలు విరిగిపడి 157 మంది మృతి

Advertisement

మృతదేహాల కోసం గాలిస్తున్నామని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మట్టిని తొలగించే యంత్రాలు లేకపోవడం వల్ల ఎర్రమట్టిని తమ చేతులతో తవ్వుతున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గోఫా రాజధాని అడిస్ అబాబా నుంచి 320 కి.మీ దూరంలో ఉంది. ఒక కొండచరియ తర్వాత మరో కొండచరియ కూడా విరిగిపడటంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగిందని పోలీసులు వెల్లడించారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×