E-Paper
Advertisement

Nellore Bus Accident: నెల్లూరులో ఆర్టీసీ బస్సు బోల్తా.. ప్రయాణికులంతా..

Nellore Bus Accident: నెల్లూరులో ఆర్టీసీ బస్సు బోల్తా.. ప్రయాణికులంతా..

Nellore Bus Accident: నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి నుంచి చామదల వైపు బయల్దేరిన ఆర్టీసీ  బోల్తాపడింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

కావలి నుంచి చామదలకు ఆర్టీసీ బస్సు బయల్దేరింది. జలదంకి మండలం 9వ మైలు వద్ద ఎదురుగా ఓ లారీ వచ్చింది. దానిని తప్పించబోయే క్రమంలో రోడ్డు పక్కన పొలాల్లో బస్ బోల్తా కొట్టింది. బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు బస్సు లోపల చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని తలుపులు పగులగొట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. కొంతమంది కిటికీ అద్దాలు పగలడంతో చేతులకు, కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించి.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ పై విచారణ కొనసాగుతోంది. లారీ డ్రైవర్ ఘటన స్థలం నుండి పారిపోయినట్లు తెలుస్తోంది. అతడిని గుర్తించేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×