BigTV English

Iran Seizes Israeli Ship: ఇరాన్ అదుపులో ఇజ్రాయెల్ కార్గో షిప్‌.. చిక్కుకున్న 17 మంది భారతీయులు

Iran Seizes Israeli Ship: ఇరాన్ అదుపులో ఇజ్రాయెల్ కార్గో షిప్‌.. చిక్కుకున్న 17 మంది భారతీయులు

Iran Seizes Israeli Ship: ఇరాన్ అనుకున్నట్లుగానే ఇజ్రాయెల్ పై యుద్ధానికి సిద్ధమైంది. రణరంగంలో సై అంటుంది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ సంస్థకు చెందిన కార్గో షిప్ ను స్వాధీనం చేసుకుంది. గల్ఫలోని ఇజ్రాయెల్ కు సంబంధించిన కంటైనర్ ను ఇరాన్ గార్డ్స్ తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ షిప్ లో 17 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.


యూఈఏ తీరంలోని హర్ముజ్ జలసంధి సమీపంలో ఎంసీఎస్ ఏరీస్ పేరుతో ఉన్న భారీ నౌకను ఇరాన్ నేవీ అధికాలు తమ స్వాధీనంలో తీసుకున్నట్లు ప్రకటించారు. తమ ఆధీనంలో ఉన్న షిప్ ను ప్రస్తుతం ఇరాన్ వైపుగా మళ్లిస్తున్నట్లు ఇరాన్ నావికాదళం వెల్లడించింది.

అయితే ఈ చర్యతో భారత్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే.. ఇరాన్ అదుపులోకి తీసుకున్న ఇజ్రాయోల్ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం వారి భద్రతపై భారత్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వెంటనే వారిని విడుదల చేయాలని.. భారత ప్రభుత్వం ఢిల్లీలోని ఇరాన్ రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది.


ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఈ షిప్ లో మొత్తం 25 మంది ఉన్నారు. అయితే వీరిలో 17 మంది భారతీయులే కావడం విశేషం. ఈ విషయం తెలుకున్న వెంటనే భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది.

ఈ నేపథ్యంలో మరో సారి ఇరాన్ ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేసింది. సిరియాలోని తమ రాయబారి కార్యాలయంలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడులకు ప్రతీకారం తప్పదని స్పష్టం చేసింది. ఏ రాత్రి అయినా ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అని ఇరాన్ హెచ్చరించింది.

Also Read: Balochistan Terror Attack : బలూచిస్థాన్ లో ఉగ్రదాడి.. 11 మంది మృతి

కాగా, శుక్రవారం రాగల 48 గంటల్లో ఇజ్రాయెల్ పై దాడులు చేస్తామని ఇరాన్ ప్రభుత్వం తరఫున అధికారులు ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత ప్రభుత్వం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు ఎవ్వరూ వెళ్లవద్దని హెచ్చరించింది.

Tags

Related News

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

Nobel Prize Peace: ట్రంప్‌‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?

Big Stories

×