E-Paper
Advertisement

Iran Seizes Israeli Ship: ఇరాన్ అదుపులో ఇజ్రాయెల్ కార్గో షిప్‌.. చిక్కుకున్న 17 మంది భారతీయులు

Iran Seizes Israeli Ship: ఇరాన్ అదుపులో ఇజ్రాయెల్ కార్గో షిప్‌.. చిక్కుకున్న 17 మంది భారతీయులు

Iran Seizes Israeli Ship: ఇరాన్ అనుకున్నట్లుగానే ఇజ్రాయెల్ పై యుద్ధానికి సిద్ధమైంది. రణరంగంలో సై అంటుంది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ సంస్థకు చెందిన కార్గో షిప్ ను స్వాధీనం చేసుకుంది. గల్ఫలోని ఇజ్రాయెల్ కు సంబంధించిన కంటైనర్ ను ఇరాన్ గార్డ్స్ తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ షిప్ లో 17 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.

యూఈఏ తీరంలోని హర్ముజ్ జలసంధి సమీపంలో ఎంసీఎస్ ఏరీస్ పేరుతో ఉన్న భారీ నౌకను ఇరాన్ నేవీ అధికాలు తమ స్వాధీనంలో తీసుకున్నట్లు ప్రకటించారు. తమ ఆధీనంలో ఉన్న షిప్ ను ప్రస్తుతం ఇరాన్ వైపుగా మళ్లిస్తున్నట్లు ఇరాన్ నావికాదళం వెల్లడించింది.

అయితే ఈ చర్యతో భారత్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే.. ఇరాన్ అదుపులోకి తీసుకున్న ఇజ్రాయోల్ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం వారి భద్రతపై భారత్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వెంటనే వారిని విడుదల చేయాలని.. భారత ప్రభుత్వం ఢిల్లీలోని ఇరాన్ రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది.

ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఈ షిప్ లో మొత్తం 25 మంది ఉన్నారు. అయితే వీరిలో 17 మంది భారతీయులే కావడం విశేషం. ఈ విషయం తెలుకున్న వెంటనే భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది.

ఈ నేపథ్యంలో మరో సారి ఇరాన్ ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేసింది. సిరియాలోని తమ రాయబారి కార్యాలయంలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడులకు ప్రతీకారం తప్పదని స్పష్టం చేసింది. ఏ రాత్రి అయినా ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అని ఇరాన్ హెచ్చరించింది.

Also Read: Balochistan Terror Attack : బలూచిస్థాన్ లో ఉగ్రదాడి.. 11 మంది మృతి

కాగా, శుక్రవారం రాగల 48 గంటల్లో ఇజ్రాయెల్ పై దాడులు చేస్తామని ఇరాన్ ప్రభుత్వం తరఫున అధికారులు ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత ప్రభుత్వం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు ఎవ్వరూ వెళ్లవద్దని హెచ్చరించింది.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×