OTT Movie : తేజ సజ్జా ‘మిరాయ్’ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ‘హనుమాన్’ తరువాత ఆ రేంజ్ లో ఈ సినిమా ఆడియన్స్ ని అలరించింది. ఈ కథ అశోకుడు రాసిన 9 పవర్ఫుల్ గ్రంథాలను కాపాడే ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రశంసలు కూడా వస్తున్నాయి. థియేటర్లలో 150 కోట్ల కలెక్షన్లతో ఈ సినిమా అబ్బురపరచింది. నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలో కూడా అదరగొడుతోంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘మిరాయ్’ (Mirai) 2025లో వచ్చిన తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ సినిమా. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్, జగపతి బాబు, జయరామ్, శ్రీయ సరన్, రితికా నాయక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది.
2025 అక్టోబర్ 10 నుంచి Jio Hotstarలోఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 8.1/10 రేటింగ్ తో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.
మిరాయ్ అనే అబ్బాయికి పుట్టుఉకతోనే ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. అతను బ్రహ్మాండ శక్తితో కనెక్ట్ అయి ఉంటాడు. అయితే కథ అశోకుడు రాసిన 9 పవర్ఫుల్ గ్రంథాలు చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రంథాల వల్ల అమరత్వం పొందవచ్చు. అంతే కాకుండా వీటి వల్ల అంతులేని శక్తులు కూడా పొందుతారు. వీటిని పొందడానికి ఒక క్రూరమైన విలన్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. ఈ సమయంలో మిరాయ్ ఈ గ్రంథాలను కాపాడాల్సి వస్తుంది. అతను తన పవర్ గురించి తెలుసుకుంటూ, ఆ గ్రంథాలను సేఫ్ గా ఉంచడానికి జర్నీ స్టార్ట్ చేస్తాడు.
Read Also : దొంగతనానికి వెళ్లి ట్రాప్ లో… ముసలాడా మజాకా… అదిరిపోయే మలయాళ కామెడీ థ్రిల్లర్
ఇక కథలో జగపతి బాబు, జయరామ్ అతనికి సహాయం చేస్తారు. విలన్ ఇందులో చాలా డేంజరస్. బ్లాక్ స్వార్డ్ అనే స్పెషల్ ఆయుధంతో ఆ గ్రంథాలను దొంగిలించాలని చూస్తాడు. అయితే మిరాయ్, విలన్ ల మధ్య భారీ ఫైట్ జరుగుతుంది. విలన్ చాలా బలంగా పోరాడతాడు. చివరికి ఆ గ్రంథాలను విలన్ చేజిక్కించుకుంటాడా ? హీరో అతని ప్రయత్నాన్ని ఆపుతాడా ? ఈ కథ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ ఫాంటసీ అడ్వెంచర్ సినిమాను చూసి తెలుసుకోండి.