E-Paper
Advertisement

Hajj Pilgrims Died : హజ్ యాత్రలో విషాదం.. 550 మంది యాత్రికులు మృతి

Hajj Pilgrims Died : హజ్ యాత్రలో విషాదం.. 550 మంది యాత్రికులు మృతి

550 Hajj Pilgrims Died in Mecca(current news in world): సౌదీ అరేబియాలో హజ్ యాత్ర ముగిసింది. ముస్లింలు తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని ఎదురుచూస్తుంటారు. తమ పాపాలను ప్రక్షాళన చేయాలని, దేవుడిని క్షమాపణలు కోరుతూ ఈ యాత్ర చేస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెలలో హజ్ యాత్ర చేపడుతారు. ఐదురోజులపాటు జరిగే ఈ యాత్ర బక్రీద్ పండుగతో ముగుస్తుంది. ఈ ఏడాది జరిగిన హజ్ యాత్ర విషాదంతో ముగిసింది. మక్కాలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటడంతో.. యాత్రికులు అధిక వేడిని తట్టుకోలేక కన్నుమూశారు. సోమవారం మక్కా మసీదులో 51.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

హజ్ యాత్రకు వెళ్లి మరణించిన వారిలో అత్యధికంగా ఈజిప్టుకు చెందిన వారే ఉన్నారని అరబ్ దౌత్యవేత్తలు వెల్లడించారు. వారిలో ఒకరు మినహా.. 322 మంది ఈజిప్టు యాత్రికులు అధిక వేడి కారణంగా మరణించారని స్పష్టం చేశారు. మరో 60 మంది జోర్డానియన్లు ఉన్నారన్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు 18.3 లక్షల మంది రాగా.. వారిలో 22 దేశాల నుంచి 16 లక్షల మంది వచ్చినట్లు తెలిపారు. మృతదేహాలను మక్కాలోని అతిపెద్ద శవాగారంలో భద్రపరిచామని, వారిని తమ సంబంధీకులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

అధిక వేడి వల్ల అనారోగ్యానికి గురైన మరో 2000 మంది యాత్రికులకు చికిత్స చేసినట్లు సౌదీ అధికారులు తెలిపారు. కాగా.. గతేడాది 240 మంది హజ్ యాత్రికులు మృతి చెందారు. వీరిలో ఎక్కువమంది ఇండోనేషియన్లే ఉన్నారు. ఇప్పటివరకూ హజ్ యాత్రలో 136 మంది ఇండోనేషియన్లు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×