E-Paper
Advertisement

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి
Advertisement

64 people feared dead as boat capsizes in Nigeria: నైజీరియాలో 6 రోజుల క్రితం జరిగిన ట్రక్కు-ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో 48 మంది మృతి చెందారు. ఈ సంఘటన మరవక ముందే నైజీరియా దేశంలో మరో ఘోరమైన దుర్ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బోటు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 64 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన సంఫారా రాష్ట్రంలో జరిగింది. స్థానిక గుమ్మి పట్టణానికి చెందిన డెభ్బై మంది రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి పడవలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ ఈ దుర్ఘటన జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి రెస్క్యూ సహాయక బృందాలను పంపించారు. అతి కష్టం మీద ఆరుగురు ప్రాణాలను రెస్క్యూ సిబ్బంది కాపాడగలిగారు. మిగిలినవారు గల్లంతయ్యారు. గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. కాగా పడవలో ఉన్న వారి పేర్లు, వివరాలు తెలియలేదు. గల్లంతయిన వారి కోసం తీవ్రంగా వెదుకుతున్నారు రెస్క్యూ టీమ్. ఈ నదిపై ఎప్పటినుంచో వంతెన కట్టాలని ప్రజలు కోరుకుంటున్నా అధికారులు ఎవరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడంతో..ప్రజలు నిత్యం పడవలనే ఆశ్రయించాల్సి వస్తోంది.

వ్యవసాయ పనుల కోసం

Advertisement

రోజుకు వెయ్యి మందికి పైగా ఈ పడవలలో ప్రయాణిస్తుంటారు. అందరూ వ్యవసాయ పనుల కోసం అవతల ఒడ్డుకు చేరుకుని సాయంత్రం దాకా పనిచేసుకుని తిరిగి మళ్లీ పడవలలో తమ ప్రాంతానికి చేరుకుంటారు. అయితే శనివారం కూడా అదే మాదిరిగా ఉపాధి కోసం తప్పనిసరి పరిస్థితిలో నదిని దాటవలసి వచ్చింది. ఆ సమయంలో నదిలో నీటి ఉధృతి బాగా ఉంది. పడవలో పరిమితి నిబంధనలు పాటించకుండా ఎక్కువ మందిని తీసుకెళ్లడమే ప్రమాదానికి మూల కారణమయింది. కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రమాదానికి కారణం ఏమిటి? ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని అధికారులను కోరారు. మృతి చెందిన వారికి పరిహారం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఓ వంతెన ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×