E-Paper
Advertisement

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

64 people feared dead as boat capsizes in Nigeria: నైజీరియాలో 6 రోజుల క్రితం జరిగిన ట్రక్కు-ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో 48 మంది మృతి చెందారు. ఈ సంఘటన మరవక ముందే నైజీరియా దేశంలో మరో ఘోరమైన దుర్ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బోటు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 64 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన సంఫారా రాష్ట్రంలో జరిగింది. స్థానిక గుమ్మి పట్టణానికి చెందిన డెభ్బై మంది రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి పడవలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ ఈ దుర్ఘటన జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి రెస్క్యూ సహాయక బృందాలను పంపించారు. అతి కష్టం మీద ఆరుగురు ప్రాణాలను రెస్క్యూ సిబ్బంది కాపాడగలిగారు. మిగిలినవారు గల్లంతయ్యారు. గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. కాగా పడవలో ఉన్న వారి పేర్లు, వివరాలు తెలియలేదు. గల్లంతయిన వారి కోసం తీవ్రంగా వెదుకుతున్నారు రెస్క్యూ టీమ్. ఈ నదిపై ఎప్పటినుంచో వంతెన కట్టాలని ప్రజలు కోరుకుంటున్నా అధికారులు ఎవరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడంతో..ప్రజలు నిత్యం పడవలనే ఆశ్రయించాల్సి వస్తోంది.

వ్యవసాయ పనుల కోసం

రోజుకు వెయ్యి మందికి పైగా ఈ పడవలలో ప్రయాణిస్తుంటారు. అందరూ వ్యవసాయ పనుల కోసం అవతల ఒడ్డుకు చేరుకుని సాయంత్రం దాకా పనిచేసుకుని తిరిగి మళ్లీ పడవలలో తమ ప్రాంతానికి చేరుకుంటారు. అయితే శనివారం కూడా అదే మాదిరిగా ఉపాధి కోసం తప్పనిసరి పరిస్థితిలో నదిని దాటవలసి వచ్చింది. ఆ సమయంలో నదిలో నీటి ఉధృతి బాగా ఉంది. పడవలో పరిమితి నిబంధనలు పాటించకుండా ఎక్కువ మందిని తీసుకెళ్లడమే ప్రమాదానికి మూల కారణమయింది. కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రమాదానికి కారణం ఏమిటి? ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని అధికారులను కోరారు. మృతి చెందిన వారికి పరిహారం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఓ వంతెన ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

Related News

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా దాడులు.. క్షిపణి ప్రయోగ కేంద్రాలు

Big Stories

×