Big Stories

India advises citizens: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత.. భారత పౌరులకు కీలక సూచనలు

India advises citizens: హమాస్-ఇజ్రాయెల్ మధ్యం యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారనుంది. రానున్న 48 గంటల్లో నేరుగా ఇజ్రాయెల్ పై దాడి చేసే అవకాశం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలా ఖమేనీ సలహాదారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత ప్రజలకు కేంద్ర విదేశాంగ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

వచ్చే రెండు రోజుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ పై మెరుపు దాడులకు దిగనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించిది. ఈ విషయాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలా ఖమేనీ సలహాదారు వెల్లడించినట్లు అందులో తెలిపింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష దాడి చేస్తే ఎదురయ్యే పర్యవసానాలపై చర్చలు ఇరాన్ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.

- Advertisement -

ఇజ్రాయెల్ పై ఏ తరహాలో దాడులు చేయాలి, ఏఏ ప్రాంతాలపై దాడులు చేయాలి, ఏ సమయంలో దాడులు చేయాలనే పూర్తి ప్లాన్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలా ఖమేనీ ఎదుట రెడీగా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో ప్రపంచ దేశాలు ఇరాన్ తీసుకున్న నిర్ణయానికి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

ఇరాన్ తీసుకున్న నిర్ణయంతో మరోసారి మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఇరాన్, ఇజ్రాయెల్ కు భారతీయులు ప్రయాణించవద్దని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది.

Also Read: మరింత కఠినంగా యూకే ఫ్యామిలీ వీసా.. వేతన పరిమితి 55% పెంపు

తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రజలు ఈ సూచనలు పాటించాలని తెలిపింది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ లో నివసిస్తున్న భారతీయ పౌరులు సమీపంలోని భారత రాయబార కార్యలయాలను సంప్రదించాలని కోరింది. అక్కడి కార్యాలయాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. అత్యవసరమైతే తప్పితే ఇరు దేశాల్లోని భారతీయలు భయటకు వెళ్లవద్దని హెచ్చిరించింది. మరో అమెరికా కూడా అప్రమత్తమై పలు చర్యలు చేపడుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News