Big Stories

Land Slide in Goldmine: విరిగిపడిన కొండచరియలు.. 54 మంది మృతి

Land Slide in Philippines Goldmine: కొండచరియలు విరిగిపడి 54 మంది మృతి చెందిన ఘటన పిలిప్పీన్స్ లో జరిగింది. పిలిప్పీన్స్ లోని డావో ప్రావిన్సు మాకో టౌన్ లో బంగారు గని సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడటంతో.. ఇళ్లు, వాహనాలు వాటికింద కూరుకుపోయాయి. గతవారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగితోంది.

- Advertisement -

Read More: మరో సంచలన దౌత్య విజయం.. మరణశిక్ష రద్దైన ఏడుగురు స్వదేశానికి..

- Advertisement -

ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాల సంఖ్య పెరుగుతున్నట్లు డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 300 మంది సిబ్బందితో సహాయక చర్యలు చేపడుతున్నా.. భారీ వర్షాలు, బురద కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోందని పేర్కొంది. మళ్లీ కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో.. సహాయక సిబ్బంది ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుందని తెలిపింది. ఈ ప్రమాదంలో మరో 63 మంది ఆచూకీ ఇంతవరకూ తెలియలేదని, వారిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News