E-Paper
Advertisement

Land Slide in Goldmine: విరిగిపడిన కొండచరియలు.. 54 మంది మృతి

Land Slide in Goldmine: విరిగిపడిన కొండచరియలు.. 54 మంది మృతి

Land Slide in Philippines Goldmine: కొండచరియలు విరిగిపడి 54 మంది మృతి చెందిన ఘటన పిలిప్పీన్స్ లో జరిగింది. పిలిప్పీన్స్ లోని డావో ప్రావిన్సు మాకో టౌన్ లో బంగారు గని సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడటంతో.. ఇళ్లు, వాహనాలు వాటికింద కూరుకుపోయాయి. గతవారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగితోంది.

Read More: మరో సంచలన దౌత్య విజయం.. మరణశిక్ష రద్దైన ఏడుగురు స్వదేశానికి..

ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాల సంఖ్య పెరుగుతున్నట్లు డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 300 మంది సిబ్బందితో సహాయక చర్యలు చేపడుతున్నా.. భారీ వర్షాలు, బురద కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోందని పేర్కొంది. మళ్లీ కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో.. సహాయక సిబ్బంది ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుందని తెలిపింది. ఈ ప్రమాదంలో మరో 63 మంది ఆచూకీ ఇంతవరకూ తెలియలేదని, వారిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×