E-Paper
Advertisement

Land Slide in Goldmine: విరిగిపడిన కొండచరియలు.. 54 మంది మృతి

Land Slide in Goldmine: విరిగిపడిన కొండచరియలు.. 54 మంది మృతి
Advertisement

Land Slide in Philippines Goldmine: కొండచరియలు విరిగిపడి 54 మంది మృతి చెందిన ఘటన పిలిప్పీన్స్ లో జరిగింది. పిలిప్పీన్స్ లోని డావో ప్రావిన్సు మాకో టౌన్ లో బంగారు గని సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 54 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడటంతో.. ఇళ్లు, వాహనాలు వాటికింద కూరుకుపోయాయి. గతవారంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగితోంది.

Read More: మరో సంచలన దౌత్య విజయం.. మరణశిక్ష రద్దైన ఏడుగురు స్వదేశానికి..

Advertisement

ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాల సంఖ్య పెరుగుతున్నట్లు డావో ప్రావిన్సు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 300 మంది సిబ్బందితో సహాయక చర్యలు చేపడుతున్నా.. భారీ వర్షాలు, బురద కారణంగా రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతోందని పేర్కొంది. మళ్లీ కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో.. సహాయక సిబ్బంది ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుందని తెలిపింది. ఈ ప్రమాదంలో మరో 63 మంది ఆచూకీ ఇంతవరకూ తెలియలేదని, వారిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×