E-Paper
Advertisement

Britain: రిషి సునాక్‌కు షాక్.. జీతాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు

Britain: రిషి సునాక్‌కు షాక్.. జీతాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు
Advertisement

Britain: బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. ఈ క్రమంలో ప్రధాని రిషి సునాక్‌కు మరో చిక్కొచ్చి పడింది. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దాదాపు 5 లక్షల మంది లండన్ వీధుల్లో పదర్శన నిర్వహించారు. అందులో 3 లక్షల మంది టీచర్లు ఉండగా.. మిగతా వాళ్లు సివిల్ సర్వెంట్లు, ట్రైన్ డ్రైవర్లు ఉన్నారు.

కరోనా సమయంలో, ఉక్రెయిన్.. రష్యా యుద్ధం కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందిపడుతున్నట్లు వారు వాపోయారు. వెంటనే గతంలో మాటిచ్చినట్లుగా జీతాలు పెంచాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఇక టీచర్లు సమ్మెలో పాల్గొనడంతో దాదాపు 23 వేల పాఠశాలలపై ప్రభావం పడింది. అలాగే రైలు డ్రైవర్లు కూడా సమ్మెకు దిగడంతో ట్రైన్లన్నీ నిలిచిపోయాయి. ఈ ప్రదర్శన బ్రిటన్‌లో గత దశాబ్దంలో జరిగిన అతి పెద్దదిగా వర్ణిస్తున్నారు.

అయితే రెండు రోజుల క్రితమే రిషి సునాక్ తన చేతిలో ఏం మ్యాజిక్ లేదని, ఇదెప్పటికీ జరిగేది కాదని స్పష్టం చేశాడు. అలాగే సమ్మెకు దిగవొద్దని.. అది గందరగోళానికి దారి తీస్తుందని ప్రధాని కార్యాలయం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×