E-Paper
Advertisement

China Claims Arunachal Pradesh: సరిహద్దు విషయంలో మరోసారి నోరు పారేసుకున్న చైనా.. ఈనెలలో ఇది నాలుగోసారి!

China Claims Arunachal Pradesh: సరిహద్దు విషయంలో మరోసారి నోరు పారేసుకున్న చైనా.. ఈనెలలో ఇది నాలుగోసారి!

Arunachal Pradesh

China Claims Arunachal Pradesh: గత కొన్నిరోజులుగా చైనా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మాటలతోనే భారత్ తో ఖయ్యానికి కాలుదువ్వుతోంది. గతంలో కొన్నిసార్లు కవ్వింపు చర్యలు పాల్పడి, భారీగా భద్రతా బలగాలని అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ వద్ద్ మోహరించింది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ పై నోరు పారేసుకుంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ అన్నాయంగా ఆక్రమించుకొందని చైనా మరోసారి నోరుపారేసుకుంది. ఈ నెలలో చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది నాలుగో సారి గమనార్హం.

ఈనెలలో అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తన జోరు పెంచింది. మాటలతోనే భారత్ తో యుద్ధానికి సిద్ధమంటోంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం అని అక్కడి అధికారులు చేసిన వ్యాఖ్యలను భారత్ తోసి పుచ్చింది. వాటని హాస్యాస్పదమైనవంటూ స్పందించింది. అయినా సరే చైనా తన వైఖరి మార్చుకోకుండా మరిన్ని వ్యాఖ్యలు చేయడంతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా వ్యాఖ్యలకు దీటుగా సమాధానాలు ఇచ్చారు. దీంతో చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్ పై వ్యాఖ్యలు చేసింది.

భారత్, చైనాల మధ్య సరిహద్ద వివాదం ఎన్నడూ పరిష్కారం కాలేదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. గతంలో ఆ ప్రాంతం చైనా ఆధీనంలో ఉండేదని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో చైనా పరిపాలన కూడా సాగేది.. 1987లో భారత్ ఆక్రమించుకొని అరుణాచల్ ప్రదేశ్ గా రూపొందించుకుందని ఘాటు విమర్శలు చేశారు. అది తమ భూభాగం అయినందునే తాము ఇటువంటి ప్రకటనలు చేస్తున్నామని అన్నారు.

Also Read: Japan vs North Korea: చర్చలకు సిద్ధమైన జపాన్.. ఆ విషయంలో తగ్గెదే లే అంటున్న కిమ్..

అయితే ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటన చేయడంతో చైనా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అప్పటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ పై ఏదో ఒక ప్రకటన చేస్తూనే వస్తోంది. అది తమ దేశంలో భూభాగమేనంటూ వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టింది. గతంలోనూ చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసేది. ఇందులో కొత్త విషయం ఏం లేకపోయినప్పటికీ ఒకే నెలలో నాలుగు సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఏదో పన్నాగం పన్నినట్లు భారత్ భావిస్తోంది.

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ మాదేనంటూ చైనా వ్యాఖ్యపై.. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన సౌత్ ఏషియన్ స్టేడియంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. చైనా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం అంటూ తోసి పుచ్చారు. దీనికి బదులుగా చైనా మరోసారి స్పందించింది.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×