Iran: వరుస భూకంపాలతో ఇరాన్ వణికిపోతోంది. తాజాగా అజర్బైజాన్ ప్రావిన్స్లోని ఖోయ్ నగరంలో భూమి కంపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. భూకంప ప్రభావంతో నగరంలోని భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. దాదాపు 440మందికిపైగా గాయాలపాలయ్యారు. శిథిలా కింద పడి కొందరు మృతి చెందగా.. తప్పించుకునేందుకు భవనాలపై నుంచి దూకి వందలాది మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
- Advertisement -
భూకంప ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఇరాన్ అత్యవసర సేవల విభాగ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మంచు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని వెల్లడించారు. మరోవైపు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని తెలిపారు.
- Advertisement -