E-Paper
Advertisement

China : విరిగిపడిన మట్టి చరియలు.. 11 మంది మృతి

China : విరిగిపడిన మట్టి చరియలు.. 11 మంది మృతి

Mud Slides in China : ఆగ్నేయ చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మట్టిపెళ్లలు విరిగి పడటంతో ఇప్పటి వరకూ 11 మంది మరణించినట్లు అక్కడి మీడియా అధికారికంగా వెల్లడించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. హునన్ ప్రావిన్సులోని హెంగ్ యాంగ్ పరిధిలో ఉన్న యూలిన్ గ్రామంలో ఇంటిపై ఆదివారం ఉదయం మట్టిచరియలు విరిగిపడ్డాయి. 18 మంది అందులో చిక్కుకోగా.. వారిలో ఆరుగురిని రక్షించామని, మరో 11 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. మరొకరి ఆచూకీ మిస్సైనట్లు తెలుస్తోంది.

ఆ ప్రాంతంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగానే మట్టిచరియలు విరిగిపడినట్లు తెలిపారు. చైనాలో ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా మరణాలు నమోదైనట్లు అక్కడి మీడియా పేర్కొంది. భారీవర్షాలకు షాంఘైలో ఓ భారీ వృక్షం కూలగా.. ఒక డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చైనాలో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ గేమి తుపాన బలహీనపడినా.. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను కారణంగా ఫిలిప్పీన్స్ లో 34 మంది మరణించగా.. తైవాన్ లో 10 మంది మృతిచెందారు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×