E-Paper
Advertisement

Oscar: ఆస్కార్ అవార్డ్‌ను బంగారంతో చేస్తారా?.. ఫుల్ డీటైల్స్..

Oscar: ఆస్కార్ అవార్డ్‌ను బంగారంతో చేస్తారా?.. ఫుల్ డీటైల్స్..
Advertisement

Oscar: ఆస్కార్.. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకోవడం ప్రతి ఒక్క సినీనటుడి డ్రీమ్. జీవితంలో ఒక్కసారైనా ఆ అవార్డును అందుకోవాలని కలలు కంటుంటారు. ఒక్కసారి ఆస్కార్ గ్రహీత అని పేరు వస్తే.. ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. అవకాశాలు వద్దన్నా.. క్యూ కడుతుంటాయి.

ఈ అవార్డులను ప్రధానం చేసే ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ 1927లో ఏర్పడింది. దీనిలో ముఖ్యంగా నటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులు అనే ఐదు విభాగాలు ఉంటాయి. సినీ ఇండస్ట్రీలో విశేషమైన సేవలందించిన వారికి ఈ సంస్థ 1929 నుంచి అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ పేరిట అవార్డులను ఇవ్వడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆ అవార్డులను ఆస్కార్ అని పిలుస్తున్నారు.

Advertisement

ఈ అవార్డును పసిడి వర్ణంతో తయారు చేస్తారు. ఓ యోధుడు వీరఖడ్గం చేతపట్టుకొని నిలుచొని ఉన్నట్లు కనిపిస్తుంది అవార్డు. దాని అడుగు భాగంలో రీలు చుట్ట ఉంటుంది. దానిలో 5 చువ్వలుంటాయి. అవి 5 విభాగాలకు సూచికలు. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ప్రసిద్ధ శిల్పి జార్జ్ స్టాన్లీ 24 క్యారెట్ల బంగారంతో పూత అద్ది, 13.5 అంగుళాల ఎత్తు, 4 కిలోల బరువుతో ఈ అవార్డును తయారు చేశారు.

ప్రస్తుతం షికాగోకు చెందిన ఆర్.ఎస్.ఓవెన్స్ అండ్ కంపెనీ ఈ అవార్డులను తయారు చేస్తుంది. ఒక్క అవార్డు తయారు చేయడానికి 400 డాలర్ల వరకు ఖర్చు వస్తుందట. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.33 వేలు. 1929లో ప్రారంభమైన ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవం ఈ ఏడాది 95 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×