BigTV English
Advertisement

India-Maldives Diplomatic Tensions : బోట్ల అడ్డగింతపై వివరణ ఇవ్వాలి.. భారత్‌ను కోరిన మాల్దీవుల విదేశాంగ శాఖ..

India-Maldives Diplomatic Tensions : బోట్ల అడ్డగింతపై వివరణ ఇవ్వాలి.. భారత్‌ను కోరిన మాల్దీవుల విదేశాంగ శాఖ..
India-Maldives Diplomatic Tensions

India-Maldives Diplomatic Tensions : భారత్‌ (India), మాల్దీవుల (Maldives) మధ్య దౌత్యపరమైన వివాదం ముదురుతోంది. రెండు దేశాల సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన చేసింది. జనవరి 31న విదేశీ మిలిటరీకి చెందిన సిబ్బంది.. మాల్దీవుల ఫిషింగ్ ఓడలో ఎక్కినట్లు సమాచారం అందిందని ఆ ప్రకటనలో పేర్కొంది. అక్కడికి చేరుకోగానే వారు భారత తీర రక్షక దళానికి చెందినవారని తేలిందని స్పష్టం చేసింది. భారత తీర రక్షక సిబ్బంది మరో రెండు పడవల్లో ఎక్కినట్లు మాల్దీవుల మిలిటరీ గుర్తించిందని తెలిపింది.


ఈ విషయంపై మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ఫిబ్రవరి 1, 2024న భారత్‌ను వివరణ కోరుతూ అధికారికంగా లేఖ రాసింది. ఎక్స్‌క్లూజీవ్ ఎకనామిక్ జోన్‌లో మాల్దీవులు చేపలు పట్టే సమయంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లఘించి భారత్ ఆపరేషన్ చేపట్టిందని.. దానిపై వివరణ ఇవ్వాలని తెలిపింది. తమ దేశానికి చెందిన ఫిషింగ్ బోట్లను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని.. సమగ్ర వివరాలు సమర్పించాలని ఆ లేఖలో పేర్కొంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 246, 253 బృందాలు ఫిషింగ్ బోట్‌లను ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపింది. కాగా దీనిపై భారత్ ఇప్పటివరకు స్పందించలేదు.

మహ్మద్‌ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. భారత్‌ సైనిక బలగాలు తమ దీవులను విడిచి వెళ్లిపోవాలని ముయిజ్జు గడువు విధించిన సంగతి తెలిసిందే.


Tags

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×