E-Paper
Advertisement

Indonesia: ఇండోనేషియాలో విమానం మిస్సింగ్.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..

Indonesia: ఇండోనేషియాలో విమానం మిస్సింగ్.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..

ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ఒక విమాన ప్రమాదం జరిగినట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండోనేషియా సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖకు చెందిన ATR 42-500 విమానం మకాస్సర్ సమీపంలో రాడార్ నుండి అదృశ్యమైంది. ఈ విమానం సమీపంలోని ఒక పర్వత ప్రాంతంలో కూలిపోయి ఉండవచ్చని, అక్కడ విమాన శకలాలను గుర్తించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

రాడార్ సిగ్నల్ కట్..

ప్రముఖ విమాన ట్రాకింగ్ సర్వీస్ FlightRadar24 అందించిన వివరాల ప్రకారం, ఈ విమానం సముద్రంపై తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. మకాస్సర్ విమానాశ్రయానికి ఈశాన్య దిశలో సుమారు 20 కిలోమీటర్ల (12 మైళ్ళు) దూరంలో, 04:20 UTC సమయానికి చివరి సిగ్నల్ రికార్డ్ అయినట్లు సమాచారం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుండి రూటింగ్ సూచనలు అందుకుని విమానాశ్రయానికి చేరువవుతున్న తరుణంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రయాణికులు ఎంత మందంటే..?

ప్రమాద సమయంలో విమానంలో ఎనిమిది మంది సిబ్బందితో పాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 11 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే, విమానంలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం అందలేదు. విమానం కూలిపోయిందనే వార్తలపై ఇండోనేషియా ప్రభుత్వం లేదా పౌర విమానయాన శాఖ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

ముమ్మరంగా గాలింపు చర్యలు..

విమానం అదృశ్యమైన వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే ఇండోనేషియా శోధన మరియు రెస్క్యూ ఏజెన్సీ రంగంలోకి దిగింది. మకాస్సర్ విభాగం ఆపరేషన్స్ హెడ్ ఆండి సుల్తాన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. విమానం చివరిగా కనిపించిన ప్రాంతానికి రెస్క్యూ బృందాలను ఇప్పటికే పంపినట్లు వెల్లడించారు. పర్వత ప్రాంతంలో శకలాలు కనిపించాయన్న వార్తల నేపథ్యంలో ఆ దిశగా గాలింపును తీవ్రతరం చేశారు.

ALSO READ: Gold Origin: భూమిపైకి అసలు బంగారం ఎలా వచ్చింది? స్టార్స్‌కు, గోల్డ్‌కు మధ్య సంబంధమేంటి..! ఖగోళ శాస్త్రవేత్తల సంచలన పరిశోధన

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×