E-Paper
Advertisement

Earthquake: అర్ధరాత్రి భారీ భూకంపం.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా, 7.4గా నమోదు

Earthquake: అర్ధరాత్రి భారీ భూకంపం.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా, 7.4గా నమోదు
Advertisement

Earthquake: అర్ధరాత్రి భారీ భూకంపం ఇండోనేషియాని వణికించింది. ప్రకృతి వైపరీత్యం వల్ల అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. మరి కొన్ని దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సివుంది. భారీగా వణికించడంతో ప్రజలు మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఇండోనేషియా ప్రభుత్వం ప్రజలకు సూచన చేసింది.

ఇండోనేషియాని వణికించిన భారీ భూకంపం

ఇండోనేషియాలో సంభవించింది భూకంపం రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైనట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే విభాగం తెలిపింది. ఈశాన్యంగా ఉన్న మొలుక్కా సముద్ర ప్రాంతంలో 7.4 తీవ్రతతో శక్తి వంతమైన భూకంపం సంభవించినట్టు తెలిపింది. బుధవారం అర్థరాత్రి ధాటిన తర్వాత సంభవించిన భూకంపం 35 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

Advertisement

ఇండోనేషియాలోని టెర్నాటేకు 127 కిలోమీటర్ల పశ్చిమ-వాయువ్యంగా ఉందని తెలిపింది. టెర్నాటే నగర జనాభా దాదాపు 2 లక్షల మంది. సుగంధ ద్రవ్యాలకు కేరాఫ్‌గా చెబుతారు.  ఈ దీవిలో  తీవ్రత  7 కు పైగా నమోదు రావడంతో పొరుగు దేశాలలో సునామీ అలలు సంభవించే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.

రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదు.. భారీగా ఆస్తి నష్టం

ఈ భూకంపం సముద్ర మట్టానికి తక్కువ లోతులో సంభవించడంతో సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశముందని భావించిన ఇండోనేషియా వాతావరణ సంస్థ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఇండోనేషియాలోని సుమిత్రా దీపుల ప్రాంతాల ప్రజలను అధికారులు ఎత్తైన ప్రదేశాలకు తరలించారు.

Advertisement

అటు మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు అలర్టయ్యాయి. 28 కోట్ల మందికి పైగా జనాభా కలిగిన విశాలమైన ద్వీప సమూహం ఇండోనేషియా. పసిఫిక్ బేసిన్‌లోని అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్‌ల వలయమైన రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండడంతో తరచుగా భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాల బారిన పడుతుంది. నాలుగేళ్ల కిందట అంటే 2022లో పశ్చిమ జావాలోని సియాంజుర్ నగరంలో సంభవించిన భూకంపం 602 మందిని బలిగొంది.

ALSO READ:  అన్నంత ప‌ని చేసింది.. బహ్రెయిన్ లో AWS డేటా సెంట‌ర్ పై ఇరాన్ దాడి

2004 డిసెంబర్‌లో హిందూ మహాసముద్రంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం కారణంగా డజను దేశాల్లో 230,000 మందికి పైగా మరణించారు. వీరిలో ఎక్కువ మంది ఇండోనేషియాలోని ఆచే ప్రావిన్స్‌కు చెందినవారు ఉన్నారు. 2018లో సులవేసిలో సంభవించి భూకంపంలో 4,300 మందికి పైగా మరణించారు. భూకంపం-సునామీ తర్వాత ఇండోనేషియాలో అత్యంత ఘోరమైన భూకంపం ఇదే.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×