E-Paper
Advertisement

Neel Acharya : అమెరికాలో మిస్సైన భారతీయ విద్యార్థి కథ.. విషాదాంతం

Neel Acharya : అమెరికాలో మిస్సైన భారతీయ విద్యార్థి కథ.. విషాదాంతం

Neel Acharya : అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారత్ కు చెందిన విద్యార్థి నీల్ ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకి కోసం గాలింపు చేపట్టగా.. క్యాంపస్ లోనే ఉన్న ఒక భవనం వద్ద మంగళవారం అతని మృతదేహం లభ్యమైందని విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిఫ్టన్ ధృవీకరించారు. కాలేజీ మ్యాగజైన్ ది ఎక్స్ పోనెంట్ లోనూ ఇందుకు సంబంధించిన కథనాన్ని ప్రచురించారు.

నీల్ ఆచార్య తల్లి గౌరీ ఆచార్య.. తన కొడుకు కనిపించడం లేదని, అతని ఆచూకీ తెలుసుకునేందుకు సహాయం చేయాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. చివరిసారిగా ఒక ఉబర్ డ్రైవర్ అతడిని క్యాంపస్ లో విడిచిపెట్టినట్లు తెలిపారు. గౌరీ ఆచార్య పోస్ట్ పై చికాగోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. విశ్వవిద్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, అందుకు కావలసిన సహకారాన్ని అందిస్తామని హామీనిచ్చింది. ఇంతలోనే నీల్ ఆచార్య మృతదేహం లభ్యమైంది.

మరో ఘటనలో లిథోనియా నగరంలో ఉంటున్న వివేక్ సైనీ (25) దారుణ హత్యకు గురయ్యాడు. జూలియన్ ఫాల్క్నర్ అనే వ్యక్తి సైనీ తలపై 50 సార్లు సుత్తితో మోదీ హతమార్చాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. భారత్ లో బీటెక్ పూర్తి చేసిన సైనీ.. ఇటీవలే యూఎస్ లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. సైనీ హత్య వార్తతో అతని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

Related News

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా దాడులు.. క్షిపణి ప్రయోగ కేంద్రాలు

Big Stories

×