E-Paper
Advertisement

Neel Acharya : అమెరికాలో మిస్సైన భారతీయ విద్యార్థి కథ.. విషాదాంతం

Neel Acharya : అమెరికాలో మిస్సైన భారతీయ విద్యార్థి కథ.. విషాదాంతం
Advertisement

Neel Acharya : అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారత్ కు చెందిన విద్యార్థి నీల్ ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకి కోసం గాలింపు చేపట్టగా.. క్యాంపస్ లోనే ఉన్న ఒక భవనం వద్ద మంగళవారం అతని మృతదేహం లభ్యమైందని విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిఫ్టన్ ధృవీకరించారు. కాలేజీ మ్యాగజైన్ ది ఎక్స్ పోనెంట్ లోనూ ఇందుకు సంబంధించిన కథనాన్ని ప్రచురించారు.

నీల్ ఆచార్య తల్లి గౌరీ ఆచార్య.. తన కొడుకు కనిపించడం లేదని, అతని ఆచూకీ తెలుసుకునేందుకు సహాయం చేయాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. చివరిసారిగా ఒక ఉబర్ డ్రైవర్ అతడిని క్యాంపస్ లో విడిచిపెట్టినట్లు తెలిపారు. గౌరీ ఆచార్య పోస్ట్ పై చికాగోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. విశ్వవిద్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, అందుకు కావలసిన సహకారాన్ని అందిస్తామని హామీనిచ్చింది. ఇంతలోనే నీల్ ఆచార్య మృతదేహం లభ్యమైంది.

Advertisement

మరో ఘటనలో లిథోనియా నగరంలో ఉంటున్న వివేక్ సైనీ (25) దారుణ హత్యకు గురయ్యాడు. జూలియన్ ఫాల్క్నర్ అనే వ్యక్తి సైనీ తలపై 50 సార్లు సుత్తితో మోదీ హతమార్చాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. భారత్ లో బీటెక్ పూర్తి చేసిన సైనీ.. ఇటీవలే యూఎస్ లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. సైనీ హత్య వార్తతో అతని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×