E-Paper
Advertisement

Kuriga Kidnap: 300 మంది కిడ్నాప్‌.. రెండు వారాల తర్వాత విడుదల!

Kuriga Kidnap: 300 మంది కిడ్నాప్‌.. రెండు వారాల తర్వాత విడుదల!
Advertisement

Kuriga Kidnap

300 People Kidnaped in Kuriga: ఆఫ్రికాలోని నైజీరియాలో రెండు వారాల క్రితం కిడ్నాప్‌కు గురైన 300 మంది పాఠశాల విద్యార్థులను బందీలు ఎట్టకేలకు విడుదల చేశారు. ఈ మేరుకు స్థానిక అధికారులు ఆదివారం విద్యార్థుల విముక్తి గురించి తెలిపారు.

Advertisement

కడునా లోని కురిగా పట్టణంలోని ఓ పాఠశాల నుంచి మార్చి 7న ముష్కరులు దాదపు 300 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. దీన్ని అడ్డుకున్న ఓ వ్యక్తిని కాల్చి చంపారు. అపహరించిన పాఠశాల విద్యార్థులను దగ్గర్లోని అడవులకు తీసుకెళ్లారు. బూటీగా 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నైజీరియా అధ్యక్షుడు టినుబు పిల్లలను ఒక్క పైసా చెల్లించకుండి విడుదల చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. చెప్పినట్టుగానే ఒక్కపైసా చెల్లించకుండా కిడ్నప్‌కు గురైన వారందరినీ విడిపించారు.

Advertisement

కుడునా గవర్నర్ టినుబు తీసుకున్న చొరవకు ధన్యవాదాలు తెలిపారు. భద్రతా ఏజెన్సీలు తీసుకున్న వ్యూహాలతోనే ఇది సాధ్యమైందని అన్నారు. నైజీరియా భద్రతా సలహాదారు దగ్గరుండి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారని కొనియాడారు. వారి చొరవతోనే పిల్లలు బయటకు వచ్చారని వెల్లడించారు.

Also Read: నైజీరియాలో స్కూల్స్‌పై ముష్కరుల దాడి.. 280 మంది విద్యార్థుల కిడ్నాప్..

నైజీరియాలోని పాఠశాలల నుండి పిల్లలను కిడ్నాప్ చేసిన అతివాద సంస్థ బోకో హరామ్ పదేళ్ల క్రితం ఈశాన్య బోర్నో రాష్ట్రంలోని చిబోక్‌లోని పాఠశాల నుంచి 276 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. వారిలో కొంతమంది ఆడవారిని ఇప్పటికీ విడిపించలేదు.

కాగా నైజీరియా విద్యార్థులను కిడ్నాప్ చేసి డబ్బును డిమాండ్ చేయడం సర్వ సాధారణమైంది. ఎలాంటి క్రయధనం చెల్లించకుండా పిల్లల్ని విడిపించడంతో నైజీరియా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Related News

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఏం చేసిందంటే, వీడియో వైరల్

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

Big Stories

Advertisement
×