E-Paper
Advertisement

Smart watch : స్మార్ట్‌వాచ్‌.. సీఈవో ప్రాణం నిలిచిందిలా!

Smart watch : స్మార్ట్‌వాచ్‌.. సీఈవో ప్రాణం నిలిచిందిలా!
Advertisement
CEO of Hockey Wales

Smart watch : స్మార్ట్‌వాచ్ విలాసవంతమైన వస్తువు కానే కాదు. ఆరోగ్యాన్ని పెంపొందించే సాధనం. అంతకుమించి ప్రాణాలను నిలబట్టే పరికరం. నిజమే. బ్రిటన్‌కు చెందిన ఓ సీఈవో‌ను గుండెపోటు నుంచి బయటపడేసింది స్మార్ట్‌వాచ్.

హాకీ వేల్స్ సీఈఒ పాల్ వేఫం వయసు 42 ఏళ్లు. దినచర్యలో భాగంగా స్వాన్‌సీలోని తన ఇంటికి సమీపంలో వేకువనే జాగింగ్ చేస్తున్నారు. అంతలో ఛాతీలో నొప్పిగా అనిపించింది. అప్పటికి వ్యాయామం మొదలుపెట్టి 5 నిమిషాలే పూర్తయింది.

Advertisement

నొప్పి తీవ్రమైంది. ఛాతీ బిగపట్టేయడంతో పాటు ఊపిరి ఆడకపోవడంతో అసౌకర్యంతో విలవిలలాడారు. అతి కష్టం మీద స్మార్ట్‌వాచ్ నుంచే భార్య లారాకు సమాచారం అందించగలిగారు. అదృష్టం కొద్దీ ఇంటికి దగ్గరలో ఆయన ఉండటంతో.. లారా వెంటనే కారులో ఆస్పత్రికి తరలించింది.

గుండెనాళాల్లో ఒకటి పూర్తిగా మూసుకుపోవడం వల్లే గుండెపోటు వచ్చినట్టు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. ఆరు రోజుల అనంతరం కోలుకుని.. ఇంటికి తిరిగొచ్చారు పాల్.

Advertisement

స్మార్ట్‌వాచ్ వల్ల ప్రాణాలు నిలిచిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయి. ఆరోగ్య సంబంధిత ఫీచర్లు స్మార్ట్‌వాచ్‌ల్లో ఉండటం వల్ల.. ఇటీవల వీటి వాడకం ఎక్కువైంది. యూజర్ల ఆరోగ్యానికి సంబంధించి లోటుపాట్లను స్మార్ట్‌వాచ్‌లు తెలియజేస్తాయి. యాపిల్ స్మార్ట్‌వాచ్‌లలో అయితే ఫాల్ డిటెక్షన్ వంటి అత్యాధునిక ఫీచర్లూ ఉన్నాయి.

మనకు ప్రమాదం జరిగినా లేక ఆకస్మికంగా కుప్పకూలిపోయినా హెచ్చరికలు పంపుతుంది. వాచ్ ధరించిన వారి లొకేషన్‌ను కూడా షేర్ చేస్తుంది. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×