PM Modi in Jordan: ప్రధాని మోదీ జోర్డాన్ లో పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీ ఓ కారులో ప్రయాణించారు. ఇందులో అంత స్పెషల్ ఏముందనుకుంటున్నారా? ఈ కారును డ్రైవ్ చేసింది జోర్డాన్ యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా. అందుకే ఈ రైడ్ చాలా స్పెషల్. జోర్డాన్లోని మ్యూజియానికి ప్రధాని మోదీని యువరాజు స్వయంగా కారులో తీసుకెళ్లారు. ఈ యువరాజు మరో స్పెషాలిటీ ఏంటంటే.. ప్రవక్త మొహమ్మద్ కుటుంబంలోని 42వ తరానికి ప్రత్యక్ష వారసుడు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా. అలాంటి వ్యక్తి మోదీని స్వయంగా రైడ్కు తీసుకెళ్లడం ఇప్పుడు ఓ సెన్సేషన్ను క్రియేట్ చేస్తుంది. అంతేకాదు ఇరు దేశాల మధ్య బంధం ఎంత బలంగా ఉందనే దానికి ఈ రైడ్ ఓ ఉదాహరణ మారింది.
ఈ రైడ్కు రెండు స్పెషాలిటీస్ ఉన్నాయి. మోదీ విజిట్ చేసిన మ్యూజియం… జోర్డాన్లోని రాస్ అల్ ఐన్ జిల్లాలో ఉంది. ఇది దేశంలోనే అతి పెద్ద మ్యూజియం కాగా ఇందులో అత్యంత ముఖ్యమైన పురావస్తు, చారిత్రక కళాఖండాలు ఉంటాయి. అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా జోర్డాన్ సింహాసనానికి వారసుడు. 2009 నుంచి దేశానికి యువరాజుగా ఉన్నారు. జోర్డాన్కు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు, ప్రాంతీయ వేదికలు ఆయనే నిర్వహిస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ హుస్సేన్ జార్జ్టౌన్ యూనివర్సిటీలో చదివారు. యూకేలోని రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్హర్స్ట్లో మిలటరీ ట్రైనింగ్ పొందారు.
Here are the highlights from a fruitful visit to Jordan… 🇮🇳 🇯🇴 pic.twitter.com/sCfwwtzIEG
— Narendra Modi (@narendramodi) December 16, 2025
ప్రధాని మోడీ జోర్డాన్లో పూర్తి స్థాయిలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2018లో జోర్డాన్లో పర్యటించినప్పటికీ అది పూర్తి స్థాయి పర్యటన కాదనే చెప్పాలి. పాలస్తీనా నుంచి భారత్కు వస్తున్న సమయంలో జోర్డాన్లో పర్యటించారు మోదీ. కానీ ఇప్పుడు పూర్తిస్థాయిలో రెండు రోజుల పాటు జోర్డాన్లో పర్యటిస్తూ చర్చలు జరుపుతున్నారు.