E-Paper
Advertisement

PM Modi Address UNGA: సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జెనెరల్ అసెంబ్లీ సమావేశాలు.. ప్రసంగించనున్న ప్రధాని మోదీ

PM Modi Address UNGA: సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జెనెరల్ అసెంబ్లీ సమావేశాలు.. ప్రసంగించనున్న ప్రధాని మోదీ

PM Modi Address UNGA: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి జెనెరల్ అసెంబ్లీ 79వ సమావేశాల్లో ప్రసంగించబోతున్నారు. ఐక్యరాజ్యసమితి జెనెరల్ అసెంబ్లీ 79వ సమావేశాలు సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరుగనున్నాయి. ఈ సమావేశాల షెడ్యూల్ ఐరాస మంగళవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ సెప్టెంబర్ 26న ప్రసంగం చేయనున్నారు. ఇటీవలే ప్రధాని మోదీ రష్యా, ఆస్ట్రియా దేశాల పర్యటన చేసి తిరిగి వచ్చారు. ఈ రెండు దేశాలతో వ్యాపార, డిఫెన్స్ రంగాలలో అభివృద్ధి కోసం పని చేసేందుకు త్వరలోనే భారత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.

ఐక్యరాజ్య సమితి జెనెరల్ అసెంబ్లీ సమావేశాల్లో పలు దేశాల అధ్యక్షులు లేదా విదేశాంగ మంత్రులు పాల్గొంటారు. వీరి మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న భద్రతా సమస్యలు, వాతావరణ మార్పు, తదితర అంశాలపై సెప్టెంబర్ 24న డిబేట్ కూడా జరుగునుంది. ఈ డిబేట్‌ని బ్రెజిల్ దేశం ప్రారంభించడం ముందు వస్తున్న పరంపర. బ్రెజిల్ ప్రతినిధి మాట్లాడిన తరువాత.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీకాలంలో చివరిసారిగా ప్రపంచ దేశాల అధ్యక్షులను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనుండడంతో.. ఐరాస వేదికగా బైడెన్ చేసే ప్రసంగం కీలకంగా మారింది.

Also Read: భార్య సహా 42 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్.. ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్ చూస్తుండగా అరెస్ట్!

భారత దేశ ప్రధానిగా మూడోసారి పదవి చేప్పటిన మోదీ, ఇంతకుముందు సెప్టెంబర్ 2021లో ఐరాస జెనెరల్ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. అయితే 2023 జూన్ 21న యోగా డే సందర్భంగా ప్రధాని మోదీ ఐరాస ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆ తరువాత అక్కడి నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని కలవడానికి వాషింగ్టన్ వెళ్లారు.

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జెనెరల్ ఆంటోనియో గుటెరస్ జెనరల్ అసెంబ్లీ సమావేశాలకు ప్రపంచ సమస్యలపై నివేదిక సమర్పించనున్నారు. ఆ తరువాత ఐరాస అధ్యక్షుడు సమావేశాలలో తొలి ప్రసంగం చేయనున్నారు. ప్రపంచ దేశాల మధ్య సహకారం తగ్గిపోతోందని.. భవిష్యత్తులో తీవ్ర సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ చర్చలు అవసరమని అయితే దేశాల మధ్య విశ్వసనీయత లోపించిన సందర్భంలో సమస్యల పరిష్కారం చాల క్లిష్టంగా మారిందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి చెప్పారు.

Also Read: గాజాలో ఆగని దాడులు.. ఒక్కరాత్రే 60 మంది మృతి

 

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×