E-Paper
Advertisement

USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. మృతుల్లో ముగ్గురు తెలుగు వాళ్లు!

USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్.. మృతుల్లో ముగ్గురు తెలుగు వాళ్లు!
Advertisement

Road accident n the United States five killed: ఆంధ్రప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుమంది మృతి చెందారు. ఇందులో ఏపీకి చెందిన ముగ్గురు ఉండగా..ఇద్దరు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. మృతుల్లో ఐదుగురు ప్రవాస భారతీయులు ఉండగా.. ఒక మహిళతోపాటు ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తులు ఉన్నారు.

వివరాల ప్రకారం.. అమెరికాలోని రాండాల్స్ సమీపంలో రాష్ట్ర రహదారిపై దక్షిణ బాన్ హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 6.45 నిమిషాలకు రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఒకరు తిరుపతి జిల్లాలోని గూడురు, ఇద్దరు శ్రీకాళకాస్తికి చెందిన వారు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు.

అయితే మృతుల్లో తిరుపతి జిల్లాలోని గూడురుకు చెందిన తిరుమూరు గోపి, శ్రీకాళహస్తికి చెందిన రాజినేని శివ, హరిత ఉన్నారు. ఈ ప్రమాదంలో హరిత భర్త చెన్ను సాయికి తీవ్రంగా గాయాలైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Advertisement

Also Read: కిమ్ మామా మజాకా.. కోపంతో సౌత్ కొరియా రోడ్లు పేల్చివేత!

ఈ ప్రమాదంపై మృతుల కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం పలువురు సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా, ఇటీవల అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని హైదరాబాద్ వ్యక్తులు ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×