E-Paper
Advertisement

North Korea: ఉత్తర కొరియాలో కొత్త పరిణామాలు.. కిమ్ స్థానంలోకి కూతురు, వరుస కార్యక్రమాలకు హాజరు

North Korea: ఉత్తర కొరియాలో కొత్త పరిణామాలు.. కిమ్ స్థానంలోకి కూతురు, వరుస కార్యక్రమాలకు హాజరు
Advertisement

North Korea: ఉత్తర కొరియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధ్యక్షుడు కిమ్ జోంగ్ తన వారసత్వ పగ్గాలను కూతురికి అప్పగించేందుకు సిద్ధమవుతున్నాయి. తెర వెనుక వ్యవహారాలు వేగంగా మారుతున్నాయి. అంతేకాదు తండ్రి కిమ్‌తోపాటు వరుసగా అన్ని కార్యక్రమాలకు కూతురు కిమ్‌ జుయే హాజరువుతున్నారు.

ఉత్తర కొరియాలో కొత్త పరిణామాలు

Advertisement

ఉత్తరకొరియా పేరు చెబితేచాలు ముందుగా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ పేరు వినబడుతోంది. ఆయన వయస్సు ప్రస్తుతానికి 42 ఏళ్లు. ఇంకా చాలా వయస్సు ఉండగానే ప్రపంచానికి తన కూతుర్ని పరిచయం చేస్తున్నాడు. కుటుంబ పాలనను నాలుగో తరానికి అప్పగించేందుకు ప్రయత్నాలను వేగవంతం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కాబోయే నేతగా 13 ఏళ్ల కూతురు కిమ్‌ జుయేను ప్రకటించే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నాయి కొరియా పొరుగు దేశాలు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి. కొద్దిరోజుల కిందట దక్షిణకొరియా పార్లమెంట్‌ సభ్యులతో జరిగిన నేషనల్‌ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఉన్నతాధికారులు సమావేశంలో చర్చకు వచ్చింది.

Advertisement

కిమ్ స్థానంలోకి కూతురు, వరుస కార్యక్రమాలకు హాజరు

ఏడాదిగా కిమ్‌ తన విదేశీ పర్యటనకు సైతం కూతుర్ని వెంట బెట్టుకెళ్తున్నారు. జనవరిలో న్యూఇయర్ రోజు పేరెంట్స్‌తో కలిసి రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని కుమ్‌ సుసన్‌ ప్యాలెస్‌కు వెళ్లింది. అందులో తొలితరం పాలకులైన ముత్తాత కిమ్‌–2 సంగ్, తాత కిమ్‌ జొంగ్‌–2ల మాసోలియం ప్రత్యేకంగా సందర్శించింది.

కిమ్ ఆలోచన వెనుక రకరకాలుగా పొరుగుదేశాలు విశ్లేషిస్తున్నాయి. నాలుగేళ్ల కిందట అనగా 2022లో ప్రపంచానికి కిమ్‌ తన కూతుర్ని పరిచయం చేశాడు. ఆనాటి నుంచి అధికారిక కార్యక్రమాలకు హాజరవుతోంది. ఉత్తర కొరియా పగ్గాలు ఆమెకు అప్పగించకపోవచ్చని తొలుత దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంచనా వేశాయి. మీడియాలో కిమ్‌ జు యే ప్రధానంగా కనిపిస్తుండటంతో మళ్లీ ఆయా వర్గాలు ఆలోచన చేస్తున్నాయి.

ALSO READ:  పాఠశాలలో కాల్పులు.. 10 మంది మృతి, కెనడాలో దారుణం

కిమ్‌ వారసురాలు అయ్యే అవకాశం కీలక దశలో ఉన్నట్లు పేర్కొన్నాయి. కిమ్‌ కూడా వంశపారం పర్యంగా అధికారానికి వచ్చాడని నిఘా వర్గాల మాట. ఈ నెల చివరలో కిమ్‌కు చెందిన వర్కర్స్‌ పార్టీ సదస్సు జరగనుందని, ఆ వేదికగా వారసత్వ ప్రణాళికలను పార్టీ పరంగా ఆమోదముద్ర వేసుకునేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×