E-Paper
Advertisement

Randhir Jaiswal: ‘అది అందరికీ తెలుసు.. దాన్ని మళ్లీ పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు’

Randhir Jaiswal: ‘అది అందరికీ తెలుసు.. దాన్ని మళ్లీ పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు’
Advertisement

Randhir Jaiswal: పొరుగు దేశం నుంచి నిష్పాక్షిక ధోరణి కనిపిస్తోందంటూ భారత విదేశాంగ శాఖ పేర్కొన్నది. భారత్ తో కుదుర్చుకున్న ‘లాహోర్ డిక్లరేషన్’ ను పాకిస్థాన్ ఉల్లింగించిందంటూ ఆ దేశానికి చెందిన మాజీ ప్రదాని నవాజ్ షరీఫ్ ఇటీవల అంగీకరించిన విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించి ఈ విధంగా వ్యాఖ్యానించింది. అణ్వాయుధాల వాడకం నివారణ, రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం విషయమై 1999 ఫిబ్రవరి నెలలో రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంతకం చేశారు.

దీనిపై నవాజ్ షరీఫ్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించామని, అది ముమ్మాటికీ తప్పేనంటూ పేర్కొన్నారు. అంతేకాదు.. అప్పటి సైనిక జనరల్ పర్వేజ్ ముషారఫ్ దుస్సాహసానికి ఒడిగట్టినందునే కార్గిల్ యుద్ధం జరిగిందని ఆయన చెప్పారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ స్పందించారు. ఈ విషయంలో భారత్ వైఖరేంటో అందరికీ తెలుసు.. దాన్ని మళ్లీ పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై పాకిస్థాన్ లోనూ నిష్పాక్షిక దృక్పథం ఏర్పడినట్లు గమనించామంటూ ఆయన స్పందించారు.

Advertisement

Also Read: చైనాలో మరో కొత్త వైరస్‌.. సోకితే 3 రోజుల్లోనే మరణం

అదేవిధంగా మాల్దీవులతో ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ అంశానికి సంబంధించి ప్రతిపాదనలేం లేవని రణ్ ధీర్ జైశ్వాల్ అన్నారు. ఒకవేళ ఆ దేశం ఆసక్తి చూపిస్తే ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇరుదేశాల మధ్య ఎప్టీఏ కుదుర్చుకునేందుకే భారత్ ప్రయత్నాలు చేస్తున్నదని ఇటీవల మాల్దీవుల మంత్రి మహ్మద్ సయీద్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×