ఇరాన్పై కొనసాగుతున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు. టెహ్రాన్ ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇరాన్కు చెందిన విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరగాల్సిన దాడులను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం ప్రారంభించాయి. అప్పటి నుంచి ఇరుపక్షాల మధ్య భీకర పోరాటం సాగుతోంది. ఈ దాడుల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమ ఆసియాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు.
యుద్ధం ఆపడానికి టెహ్రాన్ ప్రతినిధులతో అమెరికా ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చలు సఫలమైతే ప్రాంతీయంగా శాంతి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాడుల విరమణ ప్రకటనతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. చమురు ధరల పెరుగుదల అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వంటి ముప్పులు తప్పుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడతాయని ఆశిస్తున్నారు.
ALSO READ: Varanasi: ధురంధర్’ రికార్డులు జుజుబీ.. రాజమౌళి ‘వారణాసి’ వస్తే బాలీవుడ్ బచ్చానే!