E-Paper
Advertisement

Kharg Island: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కొట్టేశాం.. ఖర్గ్ ఐలాండ్‌పై వరుసగా బాంబు దాడులు.. ట్రంప్ ప్రకటన

Kharg Island: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కొట్టేశాం.. ఖర్గ్ ఐలాండ్‌పై వరుసగా బాంబు దాడులు.. ట్రంప్ ప్రకటన
Advertisement

Kharg Island: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఇరాన్ పదే పదే అమెరికాకు వార్నింగ్‌లు ఇవ్వడంతో ఆ దేశం దూకుడు ప్రదర్శించింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖర్గ్ ఐలాండ్ పై వైమానిక దాడులు చేసింది అమెరికా. ఏకంగా ఆ ఐలాండ్‌ని ధ్వంసం చేసింది.

ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కొట్టిన అమెరికా

Advertisement

ఇరాన్‌పై అమెరికా దూకుడు పెంచింది. వారం రోజుల్లో యుద్ధం ముగించాలని భావిస్తోంది. ఆ విధంగా ముందుకు అడుగులు కదులుతోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది. చరిత్రలో నిలిచిపోయే స్థాయి బాంబు దాడులు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

ప్రభుత్వం ఆదేశాల మేరకు సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు చేసినట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇరాన్‌కి కౌన్ గా భావించే ఖర్గ్ ఐలాండ్‌లో ప్రతీ సైనిక స్థావరాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని రాసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ ద్వీపంలో చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకూడదని తాను ఎంచుకున్నట్లు తెలిపారు.

Advertisement

ఖర్గ్ ఐలాండ్‌పై వరుసగా బాంబు దాడులు.. ట్రంప్ ప్రకటన

అందుకు కారణాలు కూడా చెప్పారు. అమెరికా ఆయుధాల ముందు ఇరాన్ రక్షణ వ్యవస్థలు నిలవలేవన్నారు. తమ దాడులను అడ్డుకునే శక్తి ఆ దేశానికి లేదన్నారు. ఇకనైనా ఇరాన్ వెనక్కి తగ్గి తమ దేశాన్ని కాపాడుకోవాలని సూచన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని నిర్మించలేదన్నారు. అమెరికాను బెదిరించే శక్తిని ఆ దేశానికి లేకుండా చేస్తామని చెప్పకనే చెప్పారు.

తాము దాడి చేస్తే రక్షించే సామర్థ్యం ఇరాన్‌కు లేదని కుండబద్దలు కొట్టేశారు. చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్‌లో హార్ముజ్ జలసంధి ద్వారా ట్యాంకర్లకు అమెరికా నౌకా విభాగం ఎప్పుడు ఎస్కార్ట్ ఇస్తుందని మీడియా ప్రశ్నించింది. అది త్వరలో జరుగుతుందని చెప్పేశారు. ఖర్గ్ ఐలాండ్ ఇరాన్ కు చాలా కీలకమైంది.

ALSO READ: ఒమెన్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి.. 10 మందికి గాయాలు

అది కేవలం ద్వీపం మాత్రమేకాదు ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు 96 శాతం ఇక్కడి నుంచి జరుగుతాయి. ఖర్గ్ ఐలాండ్ అమెరికా దాడి హెచ్చరిక కాదని, ఆ దేశ ఆర్థిక మూలాలను తన గుప్పిట్లోకి తీసుకోవడమేనని నిపుణుల అంచనా. ఈ ప్రాంతంపై పట్టు సాధించడం ద్వారా ఇరాన్ చర్చలకు తీసుకురావడమే అమెరికా ప్రధాన వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.

 

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×