ఆ యువతులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్రరాజ్యం చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో మనందరికి తెలిసిందే. చిన్న దొంగతనం చేసినా భారీగా శిక్షపడే అవకాశం ఉంటుంది అక్కడ. మరి చదువు కోసం దేశం కాని దేశం వెళ్లి దొంగతనానికి పాల్పడిన ఆ యువతులు అలా చోరీ కోసం ప్రయత్నించి ఇరుక్కుపోవడం సంచలనంగా మారింది.
అయితే అమెరికాలో మనదేశం లాగా బిల్లింగ్ ఉండదట. మనం కొన్న వస్తువులకు మనమే QR కోడ్ స్కాన్ చేసి బిల్లు చెల్లించాలట. అయితే వీరిద్దరు సొంతంగా బిల్లు చేసుకోవాల్సి రావడంతో హడావిడిలో మర్చిపోయామని, అవసరమైతే తీసుకున్న వస్తువులకు డబ్బులు ఎక్కువ చెల్లిస్తామని వాపోతున్నారు. అయినప్పటికి వారు చేసింది తప్పేనని.. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు.
Also Read: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి, టార్గెట్ ఎయిర్ బేస్లు
కాగా.. అరెస్ట్ అయిన ఈ అమ్మాయిలు ఇద్దరూ తెలుగు రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. వారిలో ఒకరిది హైదరాబాద్, మరొక అమ్మాయిది గుంటూరు. వీరిద్దరు అమెరికాలోని న్యూజెర్సీలోని స్టీవెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చదువుతున్నారు. ఈ సంఘటన గత నెల 19న జరిగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఇలాంటి పనులు చేయడమేంటని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.