E-Paper
Advertisement

Court Jobs: ఏడో తరగతి అర్హతతో కోర్టులో ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..

Court Jobs: ఏడో తరగతి అర్హతతో కోర్టులో ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు..

Court Jobs: నిరుద్యోగులకు ఇది గూడ్ న్యూస్. ఏడో తరగతి పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. బొంబాయి హైకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు. ఫిబ్రవరి 18న ఆన్ లైన్ అప్లికేషన్ కూడా ప్రారంభమైంది.

బొంబాయి హైకోర్టులో ఫ్యూన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లోదరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 4న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూద్దాం.

ALSO READ: TG Govt Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. త్వరలో 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 36

బోంబాయి హైకోర్టులు ఫ్యూన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు రూ.50 చెల్లిస్తే చాలు.

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.16,600 నుంచి రూ.52,400 జీతం ఉంటుంది.

విద్యార్హత: ఏడో తరగతి పాసైన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ పరిగణలోకి తీసుకోరు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయస్సు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ట వయస్సు 18 ఏళ్ల ఉండాలి. 38 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న జనరల్ కేటగిరి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయసు 43 సంవత్సరాలు ఉంటుంది.

కింద ఇచ్చిన అప్లికేషన్ లింక్ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.

అప్లికేషన్ లింక్: https://bhc.gov.in/

ALSO READ: IOCL jobs: అలెర్ట్.. టెన్త్, ఇంటర్ అర్హతతో 246 ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..

అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇదే మంచి అవకాశం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఇవ్వనున్నారు.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×