E-Paper
Advertisement

CBSE Scholarship : పేరెంట్స్ కు మీరొక్కరే అమ్మాయా! మరి ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేశారా!

CBSE Scholarship : పేరెంట్స్ కు మీరొక్కరే అమ్మాయా! మరి ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేశారా!
Advertisement

CBSE Scholarship : పేరెంట్స్ కు మీరు ఒక్కరే అమ్మాయా? ఇప్పటికే 10వ తరగతి పూర్తి చేసి ఉన్నారా? అయితే సీబీఎస్‌ఈ (CBSE) ప్రకటించిన ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే. అసలు ఏంటి ఈ స్కాలర్‌షిప్‌ స్కీమ్? ఎలా అప్లై చేయాలి? వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం

సీబీఎస్‌ఈ (CBSE) తాజాగా సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ ను ప్రకటించింది. ఈ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (CBSE Merit Scholarship) స్కీమ్‌ తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల కోసమే. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకే సీబీఎస్‌ఈ ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది.

Advertisement

అయితే ఇప్పటికే 2024 కి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. డిసెంబర్ 23తో ఈ గడువు కూడా ముగిసింది. కానీ తాజాగా ఈ గడువును మరోసారి పొడిగించింది సీబీఎస్‌ఈ. పదో తరగతి పరీక్షల్లో 70శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థినులు 2025 జనవరి 10 వరకూ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని తెలిపింది. అయితే అసలు ఈ స్కాలర్షిప్ ను ఎవరు అప్లై చేసుకోవచ్చు. దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం.

⦿ తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలు అప్లై చేసుకోవచ్చు.

Advertisement

⦿ సింగిల్ గర్ల్ చైల్డ్ ను విద్యలో ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ మెుదలైంది.

⦿ ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు ప్రతి నెలా రూ. 1000 చొప్పున రెండేళ్ల పాటు డబ్బులు వస్తాయి.

⦿ ఆ విద్యార్థినికి చెందిన ఖాతాలోనే ఈ మొత్తాన్ని ప్రతీ నెలా జమ చేస్తారు.

⦿ దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

⦿ ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల్లో 11, 12వ తరగతులు అభ్యసిస్తూ ఉండాలి.

⦿ పదో తరగతి పరీక్షల్లో కనీసం 70శాతం, ఆ పైన మార్కులు సాధించిన వారే ఈ స్కాలర్‌షిప్‌ కు అర్హులు

⦿ విద్యార్థిని ట్యూషన్‌ ఫీజు పదో తరగతిలో నెలకు రూ.2500.. సీబీఎస్‌ఈ 11, 12 తరగతులకు రూ.3వేలు మించరాదు.

⦿ సీబీఎస్‌ఈ బోర్డులో చదువుతున్న ఎన్నారై విద్యార్థినులూ ఈ అవార్డుకు అర్హులే. వీరి ట్యూషన్ ఫీజు నెలకు రూ.6వేలు మించొద్దు.

⦿ ఈ స్కాలర్‌షిప్‌నకు ఇప్పటికే ఎంపికైన విద్యార్థినులు మాత్రం 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్‌ చేసుకోవాలి.

⦿ 11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్‌ చేయించుకోవాలంటే కనీసం 70శాతం మార్కులు సాంధించాలి

⦿ ఇక వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8లక్షల కన్నా తక్కువ ఉండాలి

⦿ ఈ దరఖాస్తులను సంబంధిత పాఠశాలలు జనవరి 17వరకు వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలి.

ALSO READ : స్మార్ట్ టీవీ ఆఫర్ లో కొనేస్తారా! అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్ ఉందిగా!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×