E-Paper
Advertisement

Teaching Jobs: గుడ్ న్యూస్.. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ ఉద్యోగాలు..

Teaching Jobs: గుడ్ న్యూస్.. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ ఉద్యోగాలు..

టీచింగ్ పోస్టుల భర్తీకి సికింద్రాబాద్ ఆర్కే పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2025-2026 అకడమిక్ ఇయర్‌కు గానూ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్‌, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు

ఉద్యోగ ఖాళీలు: ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో భాగంగా పీజీటీ(ఫైన్‌ ఆర్ట్‌), టీజీటీ విభాగంలో ఇంగ్లీష్‌, హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్సెస్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సైన్స్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ అండ్‌ పీటీఐ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలి. సంబంధింత కోర్సుల్లో పాసై ఉండాలి. అంతేకాకుండా సీటెట్ లేదా టట్ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.250 చెల్లించాలి.

దరఖాస్తు తేది: 2025 జనవరి 25 తేదీ లోపు అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: దరఖాస్తు రుసుమును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ‘Army Public School RK Puram’ పేరుతో డీడీ కట్టాలి. ఆన్‌లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే దరఖాస్తు ఫామ్‌ను నింపి… “ది ప్రిన్సిపల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ ఆర్‌కే పురం, సికింద్రాబాద్” చిరునామాకు పంపించాలి.

అఫీషియల్ వెబ్‌సైట్: https://apsrkpuram.edu.in/

Also Read: Jobs Notifications: గుడ్ న్యూస్.. బీటెక్ అర్హతతో ఉద్యోగాలు..

ముఖ్యమైన వివరాలు:

*ఉద్యోగాలు- టీచింగ్ ఉద్యోగాలు

*దరఖాస్తు విధానం- ఆఫ్‌లైన్

*ఫీజు: రూ.250

*దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 25.

టీచింగ్ జాబ్ చేయాలనుకునే వారికి ఇది సువర్ణవకాశం. ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి. జాబ్ సాధించండి.

 

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×