BigTV English

Engineering Fees: మొదలైన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్.. విద్యార్థులకు తీపి కబురు

Engineering Fees: మొదలైన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్.. విద్యార్థులకు తీపి కబురు

Engineering Fees: తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. కౌన్సెలింగ్ మూడు దశల్లో జరుగుతుంది. ఆగస్టు 23 నాటికి ముగియుంది. ఈ విషయాన్ని అధికారులు స్వయంగా వెల్లడించారు. ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీటెక్​ కోర్సులకు పాత ఫీజులను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.


తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లోని ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. కౌన్సెలింగ్ మూడు దశల్లో ఆగస్టు 23 వరకు జరుగు తుందని అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు మొత్తం 176 కళాశాలలు ప్రక్రియలో పాల్గొంటాయి. అందులో 156 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు, 19 ప్రభుత్వ కళాశాలలు కౌన్సెలింగ్‌లో ఉండనున్నాయి.

ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. బీటెక్​ కోర్సులకు ఈ ఏడాది పాత ఫీజులనే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఆపై ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ సహా బి-ఒకేషనల్ కోర్సులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై కాసింత ఆర్థిక భారం తప్పింది.


ఇంజినీరింగ్​‌లో జాయిన్ అయ్యే విద్యార్థులకు ప్రభుత్వం రియింబర్స్​మెంట్​ను అందిస్తోంది.  ఫీజుల సవరణపై ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇచ్చిన ప్రతిపాదనలు న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా లేవని తెలిపింది. కళాశాలల ప్రతిపాదనలను పరిశీలించేందుకు అధికారులతో ప్రత్యేక కమిటీ వేయనుంది. ఆ కమిటీ ఫీజుల పెంపు ప్రాతిపదికను పరిశీలించనుంది.

ALSO READ: రైల్వేశాఖలో టెక్నిషియన్ జాబ్స్.. 6238 ఖాళీలు

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇతర రాష్ట్రాలు ఫీజులు ఎలా అమలు చేస్తున్నాయి అనే అంశాలను సైతం కమిటీ పరిశీలించనుంది. అన్ని ఇంజనీరింగ్‌ కళాశాలు ఫీజులను పెంచాలంటూ ప్రతిపాదనలు పంపాయి. హైదరాబాద్‌ శివార్లలోని అనేక కళాశాలలు ఫీజులను 100 శాతం పెంచాయి. గతేడాది ఇంజనీరింగ్‌లో గరిష్ఠ ఫీజు రూ.1.60 లక్షలుగా ఉండేది. ఏడాది ఫీజును రూ.2.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదనలు చేశాయి.

ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్‌ కాలేజీలను తనిఖీ చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదేకాకుండా పాలిటెక్నిక్ పూర్తి చేసి ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్‌లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఈ నిర్ణయం వర్తించనుంది. వారికీ పాత ఫీజులను వర్తిస్తాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఫీజులపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.

 

Related News

RRC: పదో తరగతి అర్హతతో రైల్వేలో 2094 ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే జాబ్

RRB JE POSTS: రైల్వేలో 2570 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. భారీ వేతనం, ఈ అర్హత ఉంటే చాలు

RRB NTPC: రైల్వేలో 8850 ఎన్టీపీసీ పోస్టులు.. ఈ జాబ్ వస్తే గోల్డెన్ లైఫ్.. ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

DDA Recruitment: ఇంటర్, డిగ్రీ అర్హతలతో 1732 ఉద్యోగాలు.. ఇలాంటి ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ బ్రదర్, రేపటి నుంచే దరఖాస్తు ప్రక్రియ

Scholarship Scheme: ఇంటర్ సర్టిఫికెట్ ఉందా..? ఛలో ఈజీగా రూ.20,000 పొందండి, ఇదిగో సింపుల్ ప్రాసెస్

BEL Notification: బెల్ నుంచి భారీ నోటిఫికేషన్.. జీతం అక్షరాల రూ.40వేలు, దరఖాస్తుకు 2 రోజులే గడువు

CDAC Recruitment: బీటెక్ అర్హతతో సీడ్యాక్‌లో భారీగా ఉద్యోగాలు.. నో అప్లికేషన్ ఫీజు, దరఖాస్తుకు చివరి తేది ఇదే..

Delhi DSSSB TGT Posts: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,346 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇలా!

Big Stories

×