BigTV English
Advertisement

Uttar Pradesh : ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

Uttar Pradesh : ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్యాంకర్ ఢీ కొట్టిన ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. షాజహాన్ పుర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారరణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.


ఈ ప్రమాదంపై అలగంజ్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జలలాబాద్ నుంచి ఒక ఆటో ప్రయాణికులతో వస్తోంది. అందులోని ప్రయాణికులంతా గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు బయల్దేరారు. ఆటోను.. ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తోన్న ఒక ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే మరణించారు. బరేలీ – ఫరూఖాబాద్ రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతులలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను సీఎం యోగి ఆదేశించారు.


Related News

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Hyderabad: యువకుడిపై నడిరోడ్డుపై కత్తితో దాడి.. హైదరాబాద్‌లో మరో హత్యా యత్న ఘటన

Anantapur Crime: ఫ్యాన్‌కు ఉరేసుకుని బ్యాంక్ మేనేజర్ సూసైడ్.. కారణం ఏంటి..?

Big Stories

×