BigTV English

Uttar Pradesh : ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

Uttar Pradesh : ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్యాంకర్ ఢీ కొట్టిన ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. షాజహాన్ పుర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారరణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.


ఈ ప్రమాదంపై అలగంజ్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జలలాబాద్ నుంచి ఒక ఆటో ప్రయాణికులతో వస్తోంది. అందులోని ప్రయాణికులంతా గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించేందుకు బయల్దేరారు. ఆటోను.. ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తోన్న ఒక ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది అక్కడికక్కడే మరణించారు. బరేలీ – ఫరూఖాబాద్ రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతులలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను సీఎం యోగి ఆదేశించారు.


Related News

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Train Accident: రైలు ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి

Husband Kills Wife: గాఢ నిద్రలో భార్య.. సైలెంటుగా గొంతుకోసి పరారైన భర్త.. అసలు ఏమైంది

Food Delivery Boy: ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై ఘోరంగా దాడి

Guntur Bus Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 25 మంది

Big Stories

×