E-Paper
Advertisement

Diwali : ఎరువుగా మారే దివ్వెలు

Diwali : ఎరువుగా మారే దివ్వెలు
Advertisement
Diwali

Diwali : వెలుగుతో పాటు సందడిని మోసుకొచ్చేది దీపావళి పండుగ. పిన్నలు, పెద్దలు అందరిలోనూ సందడే. దివ్వెల దీపావళితో ప్రమోదమే కాదు.. ప్రమాదమూ పొంచి ఉంటుంది. అందుకే ఎంతో జాగరూకత అవసరం. ఇక ఈ పండుగను పర్యావరణ హితంగా మార్చేందుకు కర్ణాటకకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న వినూత్న ప్రయత్నిమిది.

పండుగ రోజు మన ఇంటికి కాంతిని, అందాన్ని తెచ్చేవి ప్రమిదలు. వాడి పారేయకుండా ఆ దివ్వెలను ఎరువుగా వాడుకునే ఆలోచన చేసింది ప్రగతి ప్రతిష్టాన్. మైసూరుకు చెందిన ఆ సంస్థ ఆవుపేడ, మూత్రం, నెయ్యి, పెరుగును ఉపయోగించి ఎకో-ఫ్రెండ్లీ దివ్వెలను తయారు చేస్తోంది.

Advertisement

మైసూరు విద్యారణ్యపురానికి చెందిన బీకే అజయ కుమార్ జైన్ సారథ్యంలోని ఆ సంస్థ ఇప్పటికే 3 వేల ప్రమిదలను సిద్ధం చేసింది. పండుగలోగా మరో 2 వేల దివ్వెలను తయారు చేస్తామని జైన్ చెప్పారు. అక్కడి దేవరాజ్ మార్కెట్ వద్ద వీటిని ఉచితంగా పంపిణీ చేయడం మరో విశేషం. పదేళ్ల క్రితం ప్రగతి ప్రతిష్ఠాన్ సంస్థను నెలకొల్పారు జైన్. అప్పటి నుంచి ఇలా పర్యావరణహితమైన ప్రమిదలను తయారు చేసి అందరికీ అందిస్తున్నారు.

దీపావళి పండుగకు ఆరు నెలల ముందునుంచే ఈ సంస్థ వాలంటీర్లు ఆవు పేడను సేకరిస్తారు. మైసూరు పింజ్రపోల్ సొసైటీ గోశాల నిర్వాహకులు దీనిని ఉచితంగా అందజేస్తారు. ఇక పండుగకు పదిరోజుల ముందు నుంచి ప్రమిదల తయారీ కార్యక్రమం ఆరంభమవుతుంది.
స్కౌట్స్ అండ్ గైడ్స్ సహా వివిధ స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లకు వీటిని తయారు చేయడంలో శిక్షణ ఇస్తారు.

Advertisement

ఎకో-ఫ్రెండ్లీ దివ్వెలను రెండు సార్లు వాడిన తర్వాత బూడిదగా మారిపోతుంది. దీనిని ఎరువుగా మొక్కలకు వాడుకోవచ్చు. సంప్రదాయ మట్టిప్రమిదల స్థానాన్ని విద్యుత్తు బల్బులు ఆక్రమించేశాయి. విద్యుత్తు వాడకమంటే పర్యావరణంపై భారం మోపినట్టే. అందుకే ఈ ఎకో-ఫ్రెండ్లీ దివ్వెల వినియోగాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు జైన్ వెల్లడించారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×