E-Paper
Advertisement

Interest rate in post office : పోస్టాఫీసులో పెరిగిన వడ్డీ రేట్లు, నెలకు రూ.లక్షకు ఆదాయం ఎంతంటే..

Interest rate in post office : పోస్టాఫీసులో పెరిగిన వడ్డీ రేట్లు, నెలకు రూ.లక్షకు ఆదాయం ఎంతంటే..
Advertisement

Interest rates increased in post office

ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ వడ్డీ రేటును 7.1 శాతానికి పెంచింది… కేంద్రం. గత త్రైమాసికంలో ఈ వడ్డీ రేటు 6.6 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడు వడ్డీ రేటు అర శాతం పెరగడంతో… కొత్తగా పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేవారికి ఎంత ఆదాయం వస్తుందో చూద్దాం…

తాజా వడ్డీ రేటు ప్రకారం పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్లు… నెలకు రూ.591.67 రూపాయల ఆదాయం పొందొచ్చు. అంటే రూ.10 లక్షల మదుపు చేస్తే… నెల నెలా రూ.5,916 రూపాయలు అందుకోవచ్చు. పెట్టుబడికి భద్రత కల్పిస్తూ.. స్థిరమైన నెలవారీ ఆదాయం కోసం చూసే వారికి పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ మంచి ఎంపిక.

Advertisement

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో వ్యక్తిగతంగా కనీసం రూ.1000 నుంచి రూ.4.50 లక్షల వరకు… జాయింటుగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 ఏళ్లు నిండిన మైనర్ల పేరు మీద కూడా ఈ పథకంలో రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ఖాతా మేజర్‌ ఖాతాగా మారుతుంది.
ఒక వ్యక్తి ఖాతాలో గరిష్ఠ పరిమితి వరకు, అంటే రూ. 4.50 లక్షల వరకు పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం నెల నెలా రూ.2,662 పొందొచ్చు. అంటే, ఐదేళ్లలో వడ్డీ రూపంలో రూ.1,59,720 ఆదాయం వస్తుంది. ఒకవేళ జాయింట్‌ ఖాతాలో గరిష్ఠ పరిమితి అయిన రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే… నెల నెలా వడ్డీ రూపంలో రూ.5,324 ఆదాయం పొందొచ్చు. అంటే ఐదేళ్లలో వడ్డీ రూపంలో రూ.3,19,440 ఆదాయం లభిస్తుంది.

ఈ స్కీమ్‌లో ఐదేళ్ల లాక్‌-ఇన్‌-పీరియడ్‌ ఉంటుంది. ఐదేళ్లు పూర్తయ్యాక మళ్లీ పెట్టుబడి కొనసాగించవచ్చు. ఖాతాను వ్యక్తిగతంగా లేదా గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులతో జాయింటుగా లేదా మైనర్‌ పేరు మీద తెరవొచ్చు. ఒకే ఖాతా తెరవాలనే నిబంధన లేదు కానీ, ఒక ఖాతాలో ఎంత వరకు జమ చేయవచ్చనే దానిపై పరిమితి ఉంది. ఇక ముందస్తు విత్‌డ్రాలకు కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత ముందస్తు విత్‌డ్రాలను అనుమతిస్తారు. ఏడాది నుంచి మూడేళ్ల వ్యవధిలో విత్‌డ్రా చేస్తే 2 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్లకు ముందే విత్‌డ్రా చేస్తే 1 శాతం రుసుము చెల్లించాలి. ఇక ఈ ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి దేశంలోని ఏ పోస్టాఫీసుకైనా బదిలీ చేసుకోవచ్చు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×