![](https://bigtvlive.com/wp-content/uploads/2022/11/jyothirlingalu.png)
Jyotirlinga Darshan : కార్తీకమాసంలో జ్యోతిర్లింగాల దర్శనం పుణ్య ఫలితాన్ని చేకూరుస్తుంది.12 జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా , పూజించినా, తలచినా ఇహపర సుఖాలను పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.
- సౌరాష్ట్ర సోమనాథుడ్ని దర్శించుకుంటే భోగ భాగ్యాలు కలుగుతాయి.
- శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకంటే సర్వ దరిద్రాలు సమసిపోతాయి.
3.ఉజ్జయిని మహాకాలుడ్ని కొలిస్తే సర్వభయ, పాపాలు తొలగిపోతాయి.భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం పొందుతారు .
4.ఓం కారేశ్వరుడ్ని పూజించడం వల్ల ఇంటా, బయటా అన్ని అన్ని సిద్ధిస్తాయని సౌఖ్యాన్ని ఇస్తాయని - పరళి వైద్యనాథ లింగాన్ని సేవిస్తే అనేక దీర్ఘవ్యాధులు నయమవుతాయి.
- భీమేశ్వర లింగాన్ని దర్శించుకుంటే శత్రు జయం కలిగి అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి. తప్పిపోతాయి.
7.రామేశ్వరంలో రామలింగేశ్వరుడ్ని దర్శించి కాశీలో గంగా జలాన్ని అభిషేకిస్తే మహోన్నతమైన పుణ్యఫలం పరమపదాన్ని చేరతారు. - ద్వారకా నాగేశ్వరుడ్ని దర్శించుకున్న మహాపాతకాలు, ఉపపాతకాలు నశిస్తాయి.
- కాశీ విశ్వేశ్వర లింగాన్ని సేవిస్తే సమస్త కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుంది.
- నాసిక్ త్రయంబకేశ్వరుడ్నికొలిస్తే కోరికలు తీరుతాయి. అపవాదులు పోతాయి.
11.హిమాలయ కేదారేశ్వర లింగాన్ని దర్శిస్తే ముక్తిని పొందుతారు. - ఘృశ్వేశ్వర లింగాన్ని దర్శించుకుంటే ఇహపర భోగాలు ప్రాప్తిస్తాయి.
ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది.
పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దలమాట.
- Advertisement -