E-Paper
Advertisement

Drainage Gas: ప్రధాని చెప్పినట్లు.. డ్రైనేజీ నుంచి గ్యాస్ తీయొచ్చా? ఇదిగో వీళ్లు ట్రై చేస్తే ఏమైందో చూడండి!

Drainage Gas: ప్రధాని చెప్పినట్లు.. డ్రైనేజీ నుంచి గ్యాస్ తీయొచ్చా? ఇదిగో వీళ్లు ట్రై చేస్తే ఏమైందో చూడండి!
Advertisement

Drainage Gas: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత్ లో గ్యాస్ కొరత తలెత్తింది. బుక్ చేసిన వెంటనే సిలిండర్లు రాకపోతుండటంతో.. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్లను కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. డ్రైనేజీ నుంచి వంట గ్యాస్ వెలికి తీశానని మోదీ (PM Modi) చెప్పడంపై సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు దర్శనమిస్తున్నాయి.

అసలు మోదీ ఏం చెప్పారు?

2018లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రైనేజీ పైపులో నుంచి వచ్చే గ్యాస్ ను ఉపయోగించుకొని.. తాను టీ చేసుకున్నానని, ఇంటి అవసరాలు తీర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. తాజాగా ఎల్‌పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో మారోమారు మోదీ వ్యాఖ్యలను.. ఆయన ప్రత్యర్థి పార్టీ శ్రేణులు తెరపైకి తీసుకొస్తున్నారు. దేశంలోని గ్యాస్ కొరతకు ప్రధాని మోదీ పరిష్కారం చూపించారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Advertisement

వీడియోలతో ట్రోల్స్..!

ప్రధాని మోదీ చెప్పినట్లుగానే కొందరు స్టవ్ కు గ్యాస్ సరఫరాను చేసే పైపును డ్రైనేజీలో పెట్టి.. పొయ్యి వెలిగించడానికి ట్రై చేస్తున్నారు. అయితే అది పనిచేయకపోవడంతో ప్రధానిని పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంకాస్త వ్యంగ్యంగా.. డ్రైనేజీ నుంచి వచ్చే గ్యాస్ ను ఉపయోగించుకొని టీ పెట్టుకున్నట్లు సెటైరికల్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మోదీ ఇచ్చిన ఐడియాతో తాము ఈ గ్యాస్ కొరత సమయంలోనూ హ్యాపీగా ఉంటున్నామని చమత్కారంగా క్యాప్షన్స్ పెడుతున్నారు. మెుత్తంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు.. నెట్టింట పెద్ద బజ్ నే క్రియేట్ చేశాయని చెప్పవచ్చు.

Advertisement

Also Read: Dishwasher Uninstall: డిష్ వాషర్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలా? ఈ స్టెప్స్ పాటిస్తే సరి.. ఈజీగా పని అయిపోద్ది!

మోదీ వ్యాఖ్యల్లో నిజమెంత?

అయితే ప్రధాని మోదీ చెప్పినట్లుగా డ్రైనేజీ నుంచి వంట గ్యాస్ ను వెలికితీయడం సాంకేతికంగా సాధ్యమేనని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. ఈ ప్రక్రియను బయోగ్యాస్ లేదా బయో సీఎన్జీ అని కూడా అంటారు. సాధారణంగా డ్రైనేజీ నీటిలో ఉండే వ్యర్థ పదార్థాల నుండి మిథేన్ వాయువు విడుదల అవుతుంది. దానికి ఇంధనంలా మండే గుణం ఉంటుంది. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కు చెందిన శ్యాంరావు షిర్కే అనే వ్యక్తి.. మురుగు నీటి నుంచి బయో సీఎన్జీ గ్యాస్ ను తయారు చేసి.. మోదీ మాటల్లో వాస్తవం ఉందని నిరూపించారు.

Also Read: Recharge Plans: మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్.. 28 రోజులే ఎందుకు? దీని వెనకున్న వ్యూహం ఏంటి?

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×