తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సీఎం కేవలం 19 ఏళ్ల కాలంలోనే జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగానని వివరించారు. ఎమ్మెల్యేగా అనేక అనుభవాలు గడించడమే కాకుండా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశానని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ పైరవీలకు తావు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
సోనియా గాంధీ పేరుతో తెలంగాణలో అధికారం..
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం గళం వినిపించినందునే తనపై అనేక కేసులు నమోదయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. నిన్న కూడా కోర్టుకు హాజరయ్యానని చెబుతూ తనపై పరువు నష్టం దావాలు కూడా వేశారని గుర్తు చేశారు. సోనియా గాంధీ పేరుతో తెలంగాణలో అధికారం సాధించామని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగానే రాహుల్ గాంధీ నేడు దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదిగారని చెప్పారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా రాహుల్ ప్రధాని కావడం చారిత్రక అవసరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?
రాహుల్ గాంధీ సైతం ఈ సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు. పదవులను ఆశించకుండా పార్టీ కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మహాత్మా గాంధీ నిరాడంబరతను ఎగ్జాంపుల్ గా చూపుతూ బ్రిటిష్ వారే ఆయనను ఏమీ చేయలేకపోయారని గుర్తు చేశారు. ప్రజలతో మమేకమై పనిచేస్తే అధికారం దానంతట అదే వస్తుందని రాహుల్ భరోసా ఇచ్చారు. జిల్లా స్థాయిలో డీసీసీ అధ్యక్షులే సుప్రీం అని పేర్కొంటూ వారంతా తన టీమ్లో అంతర్భాగమని సీఎం రేవంత్ కొనియాడారు.
ష్టపడి పని చేస్తే ఫలితాలు తప్పకుండా వస్తాయి..
సిద్దిపేట మాజీ డీసీసీ నర్సారెడ్డి ప్రస్తుత డీసీసీ ఆంక్షా రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలను రాహుల్ గాంధీకి వివరించారు. వారి పోరాట పటిమను అభినందించిన రాహుల్ కష్టపడి పని చేస్తే ఫలితాలు తప్పకుండా వస్తాయని ఆకాంక్షించారు. రానున్న రోజులన్నీ కాంగ్రెస్ పార్టీవేనని అంతా సమిష్టిగా ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు.
ALSO READ: Kalvakuntla Kavitha: ఆ సమయానికి పార్టీ రావడం ఖాయం.. గతాన్ని తలుచుకుంటూ కవిత ఎమోషనల్