TGRTC Strike: తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో సమ్మె సైరన్ మోగింది. తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం.. యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమ్మెకు సిద్ధమైంది. ఇప్పటికే మార్చి 13న సమ్మె నోటీసు అందజేసిన కార్మిక సంఘాలు, ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టమైన స్పందన రాకపోవడంతో ఏప్రిల్ 22 లేదా 23 నుండి సమ్మెకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 20 నుండే సమ్మె ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.
ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే చేపట్టాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని, గత ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్న సుమారు రూ. 2,500 కోట్ల పాత బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా, ఆర్టీసీ యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి, వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు పట్టుబడుతున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చే నిధులను ఎటువంటి షరతులు లేకుండా సక్రమంగా విడుదల చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: మంగ్లీ వివాదంలో ఊహించని మలుపు..పంజాగుట్ట సీఐ కీలక వ్యాఖ్యలు!