BigTV English

Shakambhari Devi Puja: నవరాత్రి పూజ తర్వాత శాకంబరి పూజ ఎందుకు చేయాలంటే….

Shakambhari Devi Puja: నవరాత్రి పూజ తర్వాత శాకంబరి పూజ ఎందుకు చేయాలంటే….

Shakambhari Devi Puja : ఆషాడ మాసం ప్రారంభం నుంచి 9 రోజులపాటు వారాహి నవరాత్రులు వస్తాయి. ఈ తొమ్మిది రోజులు పూర్తి కాగానే మరుసటి రోజు దశమి రోజు వస్తుంది. ఆరోజు శాకాంబరి పూజ నిర్వహిస్తూ ఉంటారు. శాకంబరి అంటే కూరలతో కండునింపునది అని అర్థం.. శాకము అంటే కూర. బచ్చలి కూర, తోటకూర, గోంగూర , వంకాయ మొదలైన కూరలతో ఒకప్పుడు మునులకు అమ్మవారి వండి పెట్టే వారు. అందుకే అమ్మవారిని శాకంబరీ పేరు వచ్చింది.


మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు శాకంబరీ దేవి పూజ చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి దీవెన ఫలితమే పాండవులు విజయం సాధించారు. ఆషాడ మాసంలో శుక్లపక్షంలో నవరాత్రులు ముగిసిన తర్వాత వచ్చే దశమి నాడు మాత్రమే ఈ పూజ నిర్వహించాలి. అమ్మవారి విగ్రహాన్ని రకరకాల కూరగాయలతో అలంకరించి కూరగాయలే నివేదన చేసి వాటిని మహానుభావులకి స్వయంపాకంగా ఇవ్వాలి.

లేదంటే పూజ అయిన తర్వాత సాయంత్రం పూట ఈ కూరగాయలతో వంటలు వండి వీలైనంతందికి అన్నదానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ కుదిరితే ఆ కూరగాయలను గుడిలో ఇవ్వడం కూడా చేయవచ్చు. ఈ పూజ చేయలేని వారు కూరగాయలు దానం చేసినా చాలు. పేదవారికో, గురువులకే ఇవ్వడం మంచిది. ఆవేళ అన్నదానం చేసినా ఉత్తమ ఫలితాలను పొందుతారని శాస్త్రం చెబుతోంది. నిర్వహించినా మంచిదే.


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×