E-Paper
Advertisement

Rememory : మరిణించిన వారితో మాట్లాడవచ్చు.. అదే ‘రీమెమోరీ’..

Rememory : మరిణించిన వారితో మాట్లాడవచ్చు.. అదే ‘రీమెమోరీ’..
Advertisement

Rememory : ఒకసారి ఊపిరి అనేది ఆగిపోయిన తర్వాత.. ఒకసారి మనిషి లేదా ఏదైనా ప్రాణి ప్రాణం విడిచిన తర్వాత మళ్లీ వారిని బ్రతికించడం సాధ్యమా..? అసాధ్యమే కదా.. అయినా కూడా శాస్త్రవేత్తలు ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాగైనా ఒకసారి మరణించిన మనిషికి తిరిగి ప్రాణం పోయాలని వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు దీనికోసం ఏఐ సాయం తీసుకోనున్నారు.

Advertisement

మనిషి జీవితంలో ఏది కోల్పోయినా కూడా తిరిగి సాధించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ తమకు దగ్గరయిన మనిషిని పోగొట్టుకుంటే మాత్రం.. వారిని మళ్లీ వెనక్కి పొందలేరు. కానీ శాస్త్రవేత్తలు అలా మరణించిన వారిని తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు మాత్రమే కాదు.. పలు ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సాయంతో ఈ పనిని చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ కంపెనీలు.. తమకు దూరమయిన ప్రేమించే వారితో తిరిగి మాట్లాడే అవకాశాన్ని అందించనున్నాయి. అది కూడా ఏఐ సాయంతో.

ఎవరైతే తాము ప్రేమించిన వారిని కోల్పోయి.. తీవ్రమైన బాధలో ఉన్నారో.. వారికి ఈ టెక్నాలజీ అనేది ఒక వరంగా మారనుందని దీని గురించి విన్నవారు అనుకుంటున్నారు. మరోవైపు ఇలాంటి పని చేయడం నైతికంగా కరెక్ట్ కాదని పలువురు నిపుణులు ఖండిస్తున్నారు. ఒకసారి మనం కోల్పోయిన మనిషిని ఏం చేసినా తిరిగిరారు. కానీ ఈ టెక్నాలజీ అనేది వారికి కోల్పోయిన మనిషి యొక్క కంఫర్ట్‌ను తిరిగి అందించనుంది. ఈ టెక్నాలజీ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఎన్నో స్టార్టప్స్‌లో ముందుంది ‘డీప్‌బ్రెయిన్ ఏఐ’. ఇక ఈ టెక్నాలజీకి ‘రీమెమోరీ’ అనే పేరుపెట్టారు.

Advertisement

చనిపోయిన మనిషిని స్టడీ చేస్తూ.. దానికి ఒక డిజిటెక్ రెప్లికాను క్రియేట్ చేయనుంది డీప్‌బ్రెయిన్ ఏఐ. వారు కొత్తగా ఎలాంటి డిజిటల్ కంటెంట్‌ను క్రియేట్ చేయకుండా ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఉండేవారో స్టడీ చేసి.. దానికి తగినట్టుగా టెక్నాలజీని క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. వారు బ్రతికి ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, చేసిన పనులను స్టడీ చేసి వాటిని మాత్రమే రీక్రియేట్ చేస్తాం తప్పా.. కొత్త కంటెంట్‌ను సృష్టించము అని డీప్‌బ్రెయిన్ చెప్తోంది. డీప్‌బ్రెయిన్‌తో పాటు మరెన్నో స్టార్టప్ కంపెనీలు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవ్వనున్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ స్టేటస్ అనేది ఎలా ఉంది అని తెలియకపోయినా.. మార్కెట్లోకి ఇది రాగానే కచ్చితంగా సెన్సేషన్ అవుతుందని కంపెనీలు నమ్ముతున్నాయి.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×