E-Paper
Advertisement

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు
Advertisement

Pimples On Face: చర్మం మెరుస్తూ, మృదువుగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ మొటిమలు చాలా మంది ముఖ చర్మాన్ని పాడు చేస్తాయి. చాలా కాలం పాటు ఉండే మొటిమలు, మచ్చలు కూడా రావడానికి కారణం అవుతాయి. దీంతో ఎక్కువ మంది మార్కెట్ నుంచి ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు. కానీ వాటి దుష్ప్రభావాలను భరించడం అంత తేలికైన పని కాదు. అటువంటి పరిస్థితిలో, ఈ సమస్యను ఎదుర్కోవడంలో  చాలా ప్రభావవంతంగా ఉండే కొన్ని క్లియర్ స్కిన్ చిట్కాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపు:
పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమల వల్ల కలిగే మంటను తగ్గిస్తాయి. అంతే కాకుండా ముఖంపై అదనపు నూనెను గ్రహిస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడే గుణం తేనెలో ఉంది. ఒక చెంచా పసుపులో రెండు చెంచాల తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల తర్వాత కడిగేయాలి.

Advertisement

పుదీనా :
పుదీనా మీ చర్మాన్ని చల్లబరచడమే కాకుండా మొటిమలతో పోరాడడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పుదీనా ఆకులను గ్రైండ్ చేసి దాని రసాన్ని తీసి రాత్రి ముఖానికి రాసుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత కడుక్కోవాలి. దీంతో మీరు కొన్ని రోజుల్లో మొటిమలు లేని మీ ఫేస్ చూసుకుంటారు.

వేప :
వేప ఆకులు చర్మ సంరక్షణకు కూడా చాలా మేలు చేస్తాయి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి . వేప ఆకులను గ్రైండ్ చేసి, పసుపు , నీళ్ళు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. మీరు వేప పొడిని కూడా ఉపయోగించవచ్చు. దీని వల్ల ముఖంపై మొటిమలు తగ్గుతాయి.

Advertisement

శనగ పిండి :
మొటిమలతో బాధపడుతున్న చర్మానికి కూడా శనగపిండిని ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శనగ పిండి అనేది సహజమైన క్లెన్సర్. ఇది ముఖం నుండి అదనపు నూనెను గ్రహిస్తుంది. ఒక చెంచా శనగపిండిలో నీటిని కలిపి పేస్ట్‌లా చేసి, దీనిని ముఖానికి అప్లై చేసిన తర్వాత, 10 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ ప్యాక్‌ని వారానికి 3 సార్లు ఉపయోగించడం వల్ల మీ చర్మం మొటిమలు లేకుండా మరియు మృదువుగా మరియు మెరుస్తూ ఉంటుంది.

Also Read: బొప్పాయితో ముఖంపై మచ్చలు మాయం, అద్భుతమైన మెరుపు

ఓట్స్ :
మీరు జిడ్డు చర్మం, మొటిమలను వదిలించుకోవాలనుకుంటే , ఓట్స్ ఉపయోగించడం కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓట్స్‌లో ఉండే గుణాలు చర్మాన్ని శుభ్రపరచి, మొటిమలను తగ్గిస్తాయి. దీని కోసం, ఓట్స్ గ్రైండ్ చేసి, ఆపై కాస్త పసుపు వేసి ముఖానికి పట్టించండి. దీనిని 15 నిమిషాల పాటు ఉంచి కడిగేయండి. ఇలా తరుచుగా చేయడం ద్వారా ముఖంపై మచ్చలు మాయం అవుతాయి. అంతే కాకుండా ముఖం అందంగా మారుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×