E-Paper
Advertisement

Rice with Insects: పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది..?

Rice with Insects: పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది..?
Advertisement
Best Tips to Get Rid of Insects in Rice
Best Tips to Get Rid of Insects in Rice

Best Tips to Get Rid of Insects in Rice:  బియ్యం మన నిత్యావసర వస్తువుల్లో ఎంతో ముఖ్యమైనవి. మనం అందరం కష్టపడేది అన్నం కోసమే. అన్నం లేకుంటే మ‌న‌కు రోజు గ‌డ‌వ‌దు. అందుకే బియ్యాన్ని రెండు, మూడు నెలలకు సరిపడేలా ముందే నిల్వచేసి పెట్టుకుంటాం. ఇలా మందు జాగ్రత్తగా బియ్యం నిల్వ చేసుకోవడం మంచిదే.కానీ కొన్ని సందర్భాల్లో నిల్వ చేసిన బియ్యంపై పురుగులు పడుతుంటాయి. ఈ పురుగులు విస‌ర్జంచే వ్య‌ర్థాలు బియ్యంపై అలానే ఉండిపోతాయి. ఇలా పురుగులు పట్టిన బియ్యం తినడం వల్ల అనేక జీర్ణ సంబంధిత సమస్యలు చుట్టుముడుతాయి. అసలు బియ్యంలో పురుగులు పడకుండా ఏం చేయాలి? పురుగులు పడిన బియ్యం తింటే ఏమౌతుందో తెలుసుకుందాం.

బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయి..?

Advertisement

సాధారణంగా నిల్వ చేసిన బియ్యానికి, ధాన్యాలను నుసి పురుగులు, ముక్కు పురుగులు, లద్ది పురుగులు పడతాయి. ఈ పురుగులు ధాన్యం గింజలను పాడు చేస్తాయి. ధాన్యానికి రంధ్రం చేసి వాటిని పొడిగా మారుస్తాయి. ఇలా పొడిగా అయిన బియ్యాన్ని శుభ్రం చేయడం కాస్త కష్టమే అని చెప్పాలి. అంతేకాకుండా ఈ బియ్యాన్ని తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

వరి, గోధుమలకు పీచు పదార్థం ఉన్న కవచం తక్కువగా ఉంటుంది. దీని వలనే వీటిని నిల్వ చేయడం వల్ల పురుగులు పడతాయి. బియ్యం, గోధుమలకు ఉండే పీచు కవచం చాలా పలుచగా ఉంటుంది. కాట్టి వీటికి పురుగులు సులభంగా పడతాయి.

Advertisement

Also Read: రంజాన్ ఉపవాసం.. ఈ ఫుడ్స్‌తో ఎనర్జిటిక్‌గా ఉండండి!

పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా..?

బియ్యానికి పురుగులు పట్టడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బియ్యాన్ని నీటిలో నానబెట్టి, శుభ్రంగా కడిగి, ఉడకబెట్టి తింటారు కాబట్టి. ఇలా చేయడం వల్ల వాటిలోని కీటకాలు, బ్యాక్టీరియా, మలినాలు చనిపోతాయి. అందువల్ల ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చు. అలానే బియ్యంలో పురుగుల పడిన కారణంగా జబ్బు పడిన కేసులు దేశంలో చాలా తక్కువనే చెప్పాలి.

పాతకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ ఉండేది. కాబట్టి వారు ఎక్కువ మొత్తంలో బియ్యాన్ని నిల్వ చేసుకునే వారు. కానీ ప్రస్తుత కాలంలో ఉమ్మడి కటుంబాల వ్యవస్థలు అనేవి లేవు. అన్ని చిన్న కుటుంబాలుగా మారాయి. ఎక్కువ మొత్తంలో బియ్యం నిల్వ చేసుకునే అవకాశం లేదు. బియ్యానికి పురుగులు పట్టకుండా బోరిక్ పౌడర్, ఆముదం నూనె వంటి వాటిని కూడా బియ్యం డబ్బాల్లో ఉంచొచ్చు.

కీటకాల నుండి బియ్యం రక్షించడానికి మార్గాలు

  • బియ్యం నిల్వ చేసే డబ్బాల్లో బే ఆకులను ఉంచండి.
  • బియ్యాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.

Also Read: కరివేపాకు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే ఉంటది గురూ!

  • బియ్యం నిల్వ చేసిన డబ్బాల్లో కొన్ని లవంగాలను వేయండి.
  • వెల్లుల్లి పొట్టు తీసి బియ్యంలో వేయడం వల్ల బియ్యానికి పురుగు ప‌ట్ట‌వు.
  • క‌ర్ఫూరాన్ని కూడా పరుగులు రాకుండా ఉపయోగించవచ్చు.
  • బియ్యంలో పురుగులు చేరకుండా అద్భుంగా పని చేస్తుంది వేపాకు.

Disclaimer: ఈ కథనాన్ని పలు అధ్యయనాల ఆధారంగా, నిపుణుల సలహా మేరకు రూపొందించాం. దీనిని కేవలం అవగాహనగ మాత్రమే చూడండి.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×