E-Paper
Advertisement

Skin Care Tips: వీటితో గ్లోయింగ్ స్కిన్ పక్కా !

Skin Care Tips: వీటితో గ్లోయింగ్ స్కిన్ పక్కా !

Skin Care Tips: వయసు పెరిగే కొద్దీ చాలా మంది ముఖంపై మచ్చలు రావడం మొదలవుతుంది. కొన్నిసార్లు ఇది కొన్ని వ్యాధుల వల్ల కూడా జరుగుతుంది. ఏదైనా చర్మవ్యాధి వచ్చినా కూడా ముఖంపై మచ్చలు మొదలవుతాయి. ఈ మచ్చలు మీ అందాన్ని పాడు చేస్తాయి. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

పసుపు, పెరుగు, బంగాళదుంపలు వంటి పదార్థాలు ఇంట్లోనే లభిస్తాయి. వీటిలో ఉండే గుణాలు ముఖంలోని మచ్చలను తొలగించడానికి పని చేస్తాయి. ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని టిప్స్ పాటించడం వల్ల ముఖంపై మచ్చలను తగ్గించుకోవచ్చు.

ముఖంపై మచ్చలను తొలగించడానికి ఇంటి చిట్కాలు

పసుపు: పసుపులో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.

నిమ్మరసం: నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటు మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.

పెరుగు: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంతో పాటు మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.

చిట్కా:
పెరుగు- 1 టీస్పూన్
నిమ్మరసం- 1/2 టీస్పూన్
పసుపు పొడి – 1 టీస్పూన్

పై 3 పదార్థాలను పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి. తరుచుగా పేస్ట్ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది. ముఖంపై మచ్చలు కూడా తగ్గుతాయి.

Related News

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

×