డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధిని చాలా సులభంగా ఆహారపు అలవాట్లతో కంట్రోల్ సాధ్యమవుతుంది. మధ్యాహ్న భోజనం రక్తంలో షుగర్ లెవెల్స్ని స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నీల్ సవరియా ఇటీవలే సోషల్ మీడియా ద్వారా సులభంగా జీర్ణమయ్యే, పోషకాలు నిండిన, ఫైబర్ ఎక్కువ ఉండే భోజనాలను సూచిస్తారు. ఇలాంటి ఆహారం శక్తిని పెంచి, షుగర్ స్పైక్స్ను తగ్గిస్తుంది.
మధ్యాహ్నం శరీరానికి ముఖ్యమైన పోషకాలు అందించే సమయం. భోజనం మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గి ఇబ్బంది కలుగుతుంది. అలాగని హెవీ ఫుడ్ తీసుకుంటే అలసట, చక్కెర పెరుగుతాయి. సమతుల్య పోషకాలతో లంచ్ తింటే ఎనర్జీ స్థిరంగా ఉంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
చక్కెరను నెమ్మదిగా గ్రహించడానికి ఫైబర్ ఉన్న భోజనం తినాలి. కూరగాయలు, ధాన్యాలు, పప్పులు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి.
మూంగ్ దాల్ ఖిచిడి తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటాయి. తక్కువ నూనెతో, కొన్ని కూరగాయలు వేసి వండితే రక్తంలో చక్కెర స్థిరంగా ఉంటుంది.
మిల్లెట్లు బియ్యం కంటే ఆరోగ్యకరం. కూరగాయలు కలిపిన ఉప్మా తయారు చేస్తే ఫైబర్, విటమిన్లు అందుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మల్టి గ్రెయిన్ రోటీలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆకు కూరలతో కలిపి తినడం వల్ల పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. నూనె తక్కువగా వాడండి.
బ్రౌన్ రైస్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పప్పు ప్రోటీన్ ఇస్తుంది. తాజా సలాడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పెరుగు జీర్ణక్రియకు మంచిది. కూరగాయలతో కలిపి తినడం వల్ల లైట్గా ఉంటుంది. చక్కెర లేని పెరుగు వాడండి.
Also Read: వేసవిలో ఇల్లంతా బల్లులు ఇబ్బందిపెడుతున్నాయా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
ఫ్రై చేసిన ఆహారాలు, ప్యాకెట్ ఆహారాలు చక్కెరను పెంచుతాయి. ఇంట్లో తాజా ఆహారమే మంచిది.
రోజూ ఒకే సమయంలో లంచ్ చేయడం వల్ల షుగర్ లెవెల్ స్థిరంగా ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఫైబర్, ప్రోటీన్ నిండిన ఇంటి భోజనం తినాలి. మూంగ్ దాల్ ఖిచిడి, మిల్లెట్ ఉప్మా, మల్టి గ్రెయిన్ రొటీలు వంటివి మంచి ఆప్షన్స్. సరైన సమయానికి తినడం, బాగా నీళ్లు తాగడం, మితంగా తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది.