E-Paper
Advertisement

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్.. కొత్తమలుపు తిరిగిన హత్య కేసు ఘటన

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..  కొత్తమలుపు తిరిగిన హత్య కేసు ఘటన
Advertisement

Anantapur District: అనంతపురం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు, రాజశేఖర్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువకుడి హత్య కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్

Advertisement

తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు తర్వాత అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చారు పోలీసులు. అసలు ఈ కేసులో ఏం జరిగింది?

2025 లో జరిగిన ఘటన ఇది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. సోషల్ మీడియాలో అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టాడు మృతుడు మహేశ్వర్ రెడ్డి. ఈ క్రమంలో తోపుదుర్తి సోదరుడు రాజశేఖర్ రెడ్డి.. ఆ యువకుడిని తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు లేకపోలేదు. బెదిరింపులు తట్టుకోలేక మహేశ్వర్ రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

కొత్త మలుపు తిరిగిన హత్య కేసు ఘటన

ఈ వ్యవహారంపై మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి తనపై కొడుకుపై బెదిరింపులకు దిగినట్టు కొన్ని డిజిటల్ ఆధారాలను పోలీసులకు సమర్పించారు. వాటిని క్షుణ్నంగా పరిశీలించారు పోలీసులు. మొదట రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

కేసు తీవ్రత దృష్ట్యా దాన్ని అనంతపురం రూరల్-రాప్తాడు పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. విచారణలో లభించిన ఆధారాల మేరకు మంగళవారం నిందితులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, అనుచరుడు జైపాల్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. తోపుదుర్తి వ్యవహారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

ALSO READ: అన్నపైనే పడి ఏడుస్తావా? షర్మిలకు రాచమల్లు కౌంటర్.. బాబు మాటేంటి?

Related News

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

Big Stories

Advertisement
×