E-Paper
Advertisement

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్.. కొత్తమలుపు తిరిగిన హత్య కేసు ఘటన

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..  కొత్తమలుపు తిరిగిన హత్య కేసు ఘటన
Advertisement

Anantapur District: అనంతపురం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు, రాజశేఖర్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువకుడి హత్య కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్

Advertisement

తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు తర్వాత అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చారు పోలీసులు. అసలు ఈ కేసులో ఏం జరిగింది?

2025 లో జరిగిన ఘటన ఇది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. సోషల్ మీడియాలో అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టాడు మృతుడు మహేశ్వర్ రెడ్డి. ఈ క్రమంలో తోపుదుర్తి సోదరుడు రాజశేఖర్ రెడ్డి.. ఆ యువకుడిని తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు లేకపోలేదు. బెదిరింపులు తట్టుకోలేక మహేశ్వర్ రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

కొత్త మలుపు తిరిగిన హత్య కేసు ఘటన

ఈ వ్యవహారంపై మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి తనపై కొడుకుపై బెదిరింపులకు దిగినట్టు కొన్ని డిజిటల్ ఆధారాలను పోలీసులకు సమర్పించారు. వాటిని క్షుణ్నంగా పరిశీలించారు పోలీసులు. మొదట రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

కేసు తీవ్రత దృష్ట్యా దాన్ని అనంతపురం రూరల్-రాప్తాడు పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. విచారణలో లభించిన ఆధారాల మేరకు మంగళవారం నిందితులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, అనుచరుడు జైపాల్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. తోపుదుర్తి వ్యవహారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

ALSO READ: అన్నపైనే పడి ఏడుస్తావా? షర్మిలకు రాచమల్లు కౌంటర్.. బాబు మాటేంటి?

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×