Priyanka Hyderabad: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హైదరాబాద్లో మహేష్ బాబుతో కలిసి నటిస్తున్న తన రాబోయే చిత్రం ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ బిజీ షెడ్యూల్ మధ్య, ఆమె కొంచెం సమయం కేటాయించి హైదరాబాద్లోని మహేష్ బాబుకు చెందిన ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ‘ఏఎంబీ సినిమాస్’ (AMB Cinemas) ను సందర్శించారు. ఈ సందడిలో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేని కూడా ప్రియాంకతో జతకలిశారు. వీరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read also-హీరో ఉపేంద్ర ఇంట సంబరాలు.. కొడుకు ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..
ఏఎంబీ సినిమాస్ తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రియాంక, నమ్రత, సితారలు అక్కడి సిబ్బందితో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. “ఉత్తమమైన ప్రదేశాన్ని ఉత్తమమైన వారే సందర్శిస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనం. పర్ఫెక్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ కోసం ఒకే ఒక డెస్టినేషన్.. కొన్ని అనుభవాలు కేవలం ఏఎంబీ సినిమాస్ లోనే సాధ్యమవుతాయి. మా ‘మందాకిని’ ప్రియాంక చోప్రా, నమ్రత శిరోద్కర్, సితార ఘట్టమనేనిలతో కలిసి ఏఎంబీ సినిమాస్ మరింత ప్రకాశిస్తోంది” అంటూ రాసుకొచ్చింది.
ఈ అవుటింగ్ కోసం ప్రియాంక చోప్రా బ్లాక్ పోల్కా-డాట్ డ్రెస్లో ఎలిగెంట్గా కనిపించగా, నమ్రత సింపుల్ అండ్ క్లాసీ ఆఫ్-వైట్ కో-ఓర్డ్ సెట్లో కనిపించారు. సితార కూడా క్యాజువల్ అండ్ స్టైలిష్ లుక్లో ఆకట్టుకుంది. ముగ్గురూ నవ్వుతూ కెమెరాకు పోజులిచ్చారు.
ఈ ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు బ్యూటీ క్వీన్స్ (మిస్ వరల్డ్ పోటీదారు ప్రియాంక, మిస్ ఇండియా నమ్రత) ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. “ఒకే ఫ్రేమ్లో ఇద్దరు అంతర్జాతీయ స్థాయి అందాల తారలను చూడటం చాలా ఆనందంగా ఉంది” అని ఒకరు కామెంట్ చేయగా.. “అంతా సరే, ఇంతకీ మహేష్ బాబు ఎక్కడ?” అని మరికొందరు సరదాగా ప్రశ్నించారు.
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా ‘వారణాసి’ సినిమాతో భారతీయ వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్త విజయం తర్వాత రాజమౌళి చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇది. సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్తో టైమ్-ట్రావెల్ అడ్వెంచర్గా రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.
Read also-మహేష్ బాబు నెక్స్ట్ సినిమా దర్శకుడు ఆయనేనా?.. అయితే మాత్రం ఫ్యాన్స్కు పండగే..
ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అందిస్తున్న ప్రముఖ సంస్థ ‘సినీసైట్’ (Cinesite) తమ వెబ్సైట్లో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన చిన్న సారాంశాన్ని చేర్చింది. దాని ప్రకారం: “ఒక శివ భక్తుడు అమితమైన శక్తి కలిగిన ఒక బ్రహ్మాండమైన కాస్మిక్ వస్తువును కనుగొనడానికి శతాబ్దాలుగా దాగి ఉన్న రహస్యాలను ఛేదిస్తూ కాలంలో ప్రమాదకరమైన ప్రయాణం చేస్తాడు. అయితే ఈ మిషన్ వెనుక ఉన్న అసలు నిజం.. ప్రపంచాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకునే ఒక మాస్టర్మైండ్ ప్లాన్ అని అతను గ్రహిస్తాడు.” అదే సినిమా సారాశం.
Proof that the best is visited only by the best 🌟
Because when it comes to the perfect movie experience, there’s only one destination ✨And some experiences can only happen at #AMBCinemas 😌
Like our Mandakini, @priyankachopra along with #NamrataShirodkar… pic.twitter.com/vPVzYNgZxF
— AMB Cinemas (@amb_cinemas) May 25, 2026