E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రోజంతా కూర్చొని పనిచేసేవారిలో చెప్పుకోలేని ఆ ఒక్క ఆరోగ్య సమస్య తీవ్రం.. డాక్టర్ల హెచ్చరిక

రోజంతా కూర్చొని పనిచేసేవారిలో చెప్పుకోలేని ఆ ఒక్క ఆరోగ్య సమస్య తీవ్రం.. డాక్టర్ల హెచ్చరిక
Advertisement

ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజులో ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చునే పనులు చేస్తున్నారు. ఈ అలవాటు పనితీరును మెరుగుపరిచినా, కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ముఖ్యంగా పైల్స్ (హెమరాయిడ్స్) సమస్య యువ ఉద్యోగుల్లో కూడా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. పుణె నగరంలోని అపోలో స్పెక్ట్రా హాస్పిల్‌లో జెనెరల్ సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ జాధవ్ ప్రకారం.. పైల్స్ అనేది మలద్వారం చుట్టూ ఉన్న రక్తనాళాలు వాపు రావడం వల్ల ఏర్పడే సమస్య. దీని వల్ల అసౌకర్యం, నొప్పి, ఇతర ఇబ్బందులకు దారితీస్తుంది.

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ప్రమాదం ఎందుకు పెరుగుతుంది?

రోజుకు 8 నుంచి 10 గంటల వరకు కుర్చీలో కూర్చోవడం వల్ల మలద్వారం చుట్టూ ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి పైల్స్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. దీనికి తోడు తక్కువ నీరు తాగడం, పీచుపదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, మలబద్ధకం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. రక్తప్రసరణ కూడా సరిగా జరగకపోవడం వల్ల ఈ సమస్య వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

యువ ఉద్యోగుల్లో వేగంగా పెరుగుతున్న కేసులు

Advertisement

ఇటీవలి కాలంలో 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఉద్యోగుల్లో పైల్స్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
చాలా మంది ప్రారంభ లక్షణాలను పట్టించుకోరు. దీంతో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది.

ఈ లక్షణాలను అసలు నిర్లక్ష్యం చేయకండి

మలద్వారం వద్ద దురద, చికాకు

పైల్స్ ప్రారంభ లక్షణాల్లో దురద ఒకటి. ఈ ప్రాంతంలో నిరంతర చికాకు కూడా కనిపించవచ్చు.

మల విసర్జన సమయంలో నొప్పి

Advertisement

మలబద్ధకం సమస్య ఉన్నవారిలో మల విసర్జన సమయంలో నొప్పి లేదా అసౌకర్యం ఎక్కువగా కనిపిస్తుంది.

రక్తస్రావం కనిపించడం

మల విసర్జన సమయంలో లేదా తర్వాత ఎర్రటి రక్తం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

వాపు, మల విసర్జన పూర్తిగా జరగలేదనే భావన

కొంతమందికి వాపు కనిపించవచ్చు. మరికొందరికి మలం పూర్తిగా బయటకు విసర్జన జరగలేదనే భావన కలుగుతుంది.

కొన్ని అలవాట్లు మార్చుకుంటే పైల్స్‌ను నివారించవచ్చు

రోజూ పండ్లు, కూరగాయలు, సలాడ్లు, ధాన్యాలను ఆహారంలో చేర్చాలి. ఇవి పీచుపదార్థాలు అందించి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. రోజంతా తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతి గంటకు ఒకసారి లేచి కొద్దిసేపు నడవడం మంచిది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజూ వ్యాయామం చేయడం కూడా ఎంతో ఉపయోగకరం. అలాగే మల విసర్జన అవసరం వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదు.

Also Read: ఉదయం అలారం మోగుతున్నా ఆఫ్ చేసి పడుకుంటున్నారా? అలారం లేకుండానే లేవడానికి సింపుల్ టిప్స్

ముందస్తు చికిత్స ఎందుకు అవసరం?

చాలామంది ఈ సమస్య గురించి చెప్పడానికి సంకోచిస్తారు. కానీ చికిత్స ఆలస్యం చేస్తే నొప్పి, రక్తస్రావం, రక్తహీనత వంటి సమస్యలు రావచ్చు.
ప్రస్తుతం ఆధునిక వైద్య విధానాలతో తక్కువ నొప్పితో, త్వరగా కోలుకునే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగుల్లో పైల్స్ సమస్య వేగంగా పెరుగుతోంది. సరైన ఆహారం, తగినంత నీరు, క్రమం తప్పని వ్యాయామం, ముందస్తు వైద్య సలహా ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి మీ జీర్ణవ్యవస్థను, పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Related News

మహిళలు ఇంట్లో చేసే ఈ తప్పుల వల్లే ఆర్థిక కష్టాలు.. వాస్తు శాస్త్రంలో ఏముందంటే

దాంపత్య జీవితంలో ప్రేమతో పాటు ఆత్మగౌరవం చాలా ముఖ్యం.. ఈ విషయాల్లో ఎప్పుడూ రాజీ పడకండి

10 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గొచ్చా? బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు డాక్టర్ చేసిన సూచనలు

ఇంటి ఖాళీ టెర్రెస్‌ను కూల్ లుక్‌తో ఇలా మార్చండి.. అందమైన రూఫ్ టాప్ కెఫె డిజైన్

అన్నం తిన్నాక టీ తాగడం మంచిదా? కాదా? సైన్స్ ఏం చెబుతోంది?

వర్షాకాలంలో హెల్తీగా ఉండాలా? ఈ 8 ఈజీ టిప్స్ ఫాలో అవ్వండి!

ఉల్లి పాయను ఇలా కోస్తే.. అసలు కళ్లే మండవు, మీరు చేస్తున్న తప్పు ఇదే!

Big Stories

×