E-Paper
Advertisement

Ayurvedic Beauty Care: ఆయుర్వేద మూలికలతో మొటిమలు, మచ్చలకు చెక్..!

Ayurvedic Beauty Care: ఆయుర్వేద మూలికలతో మొటిమలు, మచ్చలకు చెక్..!

Ayurvedic Beauty Care: వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల చర్మం రంగు మారుతూ ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడి మెలనిన్ ను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చర్మం నల్లగా మారడంతో పాటు ముఖంపై మొటిమలు, మచ్చలు పెరుగుతాయి. అందుకే వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచుకోవడానికి ఆయుర్వేదిక మూలికలను వాడటం మంచిది అవేంటో ఇప్పుడు చూద్దాం.

చందనం:

ఎండాకాలంలో వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు చందనాన్ని ఉపయోగించవచ్చు .దీని పాలల్లో కలిపి తాగడం వల్ల ఎండ నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా వేసవిలో చందనం పొడిని ఫేస్‌ప్యాక్‌లా కూడా వేసుకోవచ్చు. చర్మం జిడ్డుగా ఉంటే కాస్త చెందనం పొడిలో రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. ఒక వేళ పొడి చర్మమైతే దానిని పచ్చిపాలతో కలిపాలి. ఇది మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది

అలోవెరా:

ఎండ నుంచి ఉపశమనం పొందడానికి అలోవెరా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలోవెరా చర్మాన్ని తేమగా మార్చడానికి సహాయపడుతుంది. అలోవెరాను రకరకాల ఉపయోగించవచ్చు ఎండాకాలంలో చర్మం మాత్రమే కాకుండా వెంట్రుకలు కూడా సూర్యరశ్మి తగిలి పొడిబారడం కనిపిస్తుంది. అయితే అటువంటి సమయంలో దీన్ని ఫేస్‌ ప్యాక్‌లాగా కూడా ఉపయోగించవచ్చు. ముఖం మెరుస్తూ ఉండటంతో పాటు మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.

Also Read: Migraine: మైగ్రేన్ వేధిస్తోందా ? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!

వేపాకు:

వేప ఆకులను అప్పుడప్పుడు తింటే చాలా మేలు జరుగుతుంది. ఇవి శరీరంలోని టాక్సిన్ లను బయటకు పంపడంలో సహాయ పడతాయి. మొటిమలు, మచ్చలు లేని ముఖం కోసం దీనిని ఉపయోగించవచ్చు. కొందరు ఫేస్ ప్యాక్ లాగా కూడా వేపాకును తయారు చేసుకొని ఉపయోగిస్తారు. ఒక వేళ దీని వాసన నచ్చకపోతే ఎండు ఆకులను గ్రైండ్ చేసి ఉపయోగించవచ్చు. ఇది ముఖంపై మచ్చలు రాకుండా చేస్తుంది.

మంజిష్ట:

మంజిష్ట శరీరం చల్లబడడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రసిద్ధి చెందిన ఆయుర్వేద మూలిక. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. మంజిష్ట పొడిని ముఖానికి తేనె కలిపి రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీంతో ముడతల సమస్య కూడా దూరమవుతుంది. మచ్చలు రాకుండా ఉంటాయి.

Also Read: చియా సీడ్స్‌తో గ్లాస్ స్కిన్.. ఎలా వాడాలో తెలుసా మరి..?

బెయిల్ రసం:

ఎండాకాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి మొటిమలు లేదా చర్మ సమస్యలకు దారితీస్తాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ముఖం మీద మొటిమలు రావడానికిది సాధారణ కారణాల్లో వేడి ఒకటి. అటువంటి పరిస్థితిలో బియిల్ రసం తీసుకోవడం వల్ల పేగులలోని వేడిని తగ్గుతుంది. అంతే కాకుండా చర్యం కాంతి వంతంగా ఉంటుంది.

Related News

ప్రతి తండ్రి తన కుమారుడికి ఈ జీవిత పాఠాలు తప్పనిసరిగా నేర్పాలి.. పిల్లల వ్యక్తిత్వానికి ఇవి చాలా అవసరం

శ్రమ లేకుండా టిఫిన్ స్నాక్స్ రెడీ.. కరకరలాడే సూపర్ టేస్టీ రవ్వ కట్లెట్ రెసిపీ

పెరుగు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. ఎలా తినాలో చెప్పిన డాక్టర్

బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుతున్నారా? ఈ కొత్త ట్రెండ్ గురించి తెలిస్తే షాకవుతారు!

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

Big Stories

×